Director: 2024 అలా మొదలైందో లేదో ఇలా పెళ్లిళ్ల హడావిడి ఎక్కువగా కనిపిస్తుంది. తాజాగా స్టార్ హీరోయిన్ రకుల్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అలా గతంలో పెళ్లి అంటే ఇబ్బంది పడేవారు ప్రస్తుత కాలంలో పెళ్లిళ్లపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక తాజాగా ఇండస్ట్రీకి చెందిన మరో ఇద్దరూ వివాహం చేసుకున్నారు.
” శ్రీకరం ” సినిమా దర్శకుడు కిశోర్ రెడ్డి వివాహం చేసుకున్నారు. తెలుగు యాంకర్ కృష్ణ చైతన్య తో ఆయన వివాహం జరిగినట్లు తెలుస్తుంది. శర్వానంద్ హీరోగా శ్రీకారం సినిమా కి దర్శకత్వం వహించిన ఈయన తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఇక అనంతరం లక్ష్మి రావే మా ఇంటికి, లవ్. కామ్ వంటి సినిమాలకి దర్శకత్వం వహించాడు కిశోర్.
ఇక ఈయన ఒక తెలుగులోనే కాకుండా కన్నడంలో ఓ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. తన కెరీర్లో అనేక సినిమాలకి దర్శకత్వం వహించినప్పటికీ శ్రీకరం మూవీ సూపర్ హిట్ పాపులారిటీ అందించింది. ఇక నేడు అనగా మార్చ్ ఒకటవ తేదీన తెల్లారి జామున 3 గంటల సమయంలో హైదరాబాద్లో మామిడి పెళ్లి శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో యాంకర్ కృష్ణ చైతన్యను.. కిశోర్ వివాహం చేసుకున్నట్లు కొన్ని ఫోటోలు ద్వారా వెళ్లడయింది.
యాంకర్ కేసీగా కృష్ణ చైతన్య మనందరికీ సుపరిచితమే. ఈమె కొల్ల గతంలో ఆర్జే గా కూడా పనిచేసింది. ఆర్జె స్మైలీ క్వీన్ పేరుతో ఆమె రేడియో జాకీగా వ్యవహరించి పలువురును మెప్పించింది. అదేవిధంగా పలు యూట్యూబ్ ఛానల్ కి ఇతర సినిమా కార్యక్రమాలకి యాంకరింగ్ కూడా చేసింది. ఇక వీరిద్దరిదీ ప్రేమ వివాహం అయినట్లు తెలుస్తుంది. కొన్నేళ్లగా ప్రేమించుకున్న వీరిద్దరూ పెద్దల అంగీకారంతో నేడు ఒకటయ్యారు. ఇక వీరి పెళ్లికి సంబంధించిన మరిన్ని ఫోటోలు త్వరలోనే వెలుగులోకి రానున్నాయి.