మెగాస్టార్ 151వ చిత్రం `సైరా నరసింహారెడ్డి`. ప్రెస్టీజియస్గా భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్ని జరుపుకుంటోంది. లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమా బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం ప్రముఖ బ్యాగ్రౌండ్ స్పెషలిస్ట్ జూలియస్ ప్యాకియంను రప్పించారట. బాలీవుడ్లో భజరంగీ భాయ్జాన్, సుల్తాన్, ధూమ్ 3, భారత్ వంటి చిత్రాలకు ఈయనే బ్యాగ్రౌండ్ స్కోర్ను అందించారు. ఇప్పుడు నిర్మాత రామ్చరణ్ ఆయన్ని రంగంలోకి దించడం విశేషం. ఇప్పటి బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా ఇప్పుడు మరో స్పెషలిస్ట్ కూడా జాయిన్ అయ్యారు.
చిరంజీవి, అమితాబ్, విజయ్ సేతుపతి, కిచ్చాసుదీప్, జగపతిబాబు, నయనతార, అనుష్క, తమన్నా వంటి భారీ తారాగణంతో తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 300 కోట్ల రూపాయల బడ్జెట్తో సినిమా తెరకెక్కుతోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అక్టోబర్ 2న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
previous post
next post