బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ఫీవర్ త్వరలో తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభం కాబోతుంది. నిజానికి తెలుగులో వచ్చిన షోలు అన్నీ ఒకవైపు అయితే.. బిగ్ బాస్ షో మరోవైపు. అవును.. ఈ షోకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజే వేరు.
హిందీలో ఈ షోకు ఎంత పాపులారిటీ ఉందో.. తెలుగులోనూ అంతే ఉంది. ఇప్పటికే పూర్తయిన మూడు సీజన్లు సక్సెసే. ముఖ్యంగా మూడో సీజన్ మాత్రం సూపర్ సక్సెస్ అయింది. నాగార్జున హోస్ట్ గా అద్భుతంగా షోను రక్తికట్టించారు. మొదటి సీజన్ లో జూనియర్ ఎన్టీఆర్ కూడా షోను ఎక్కడికో తీసుకెళ్లగా.. రెండో సీజన్ లో నానీ తన నేచురాలిటీతో సీజన్ ను మరింతగా జనాల్లోకి తీసుకెళ్లారు. మూడో సీజన్ అయితే ఇక.. చెప్పక్కర్లేదు. బిగ్ బాస్ ఎపిసోడ్ మొదలైందంటే చాలు.. జనాలు టీవీలకు అతుక్కుపోయారు.
అయితే.. ఈసారి సీజన్ 4 ప్రారంభం కంటే ముందే కరోనా రావడంతో ఈసారి సీజన్ 4 ఉంటుందో లేదో అని బిగ్ బాస్ అభిమానులు కొంచెం టెన్షన్ పడ్డారు. కానీ.. బిగ్ బాస్ సీజన్ 4 త్వరలో ప్రారంభం కాబోతున్నదంటూ కొన్ని ప్రోమోలను మాటీవీ వదిలేసరికి బిగ్ బాస్ అభిమానులు తెగ ఖుషీ అయ్యారు.
ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 4 టీజర్ ను కూడా వదిలారు. ఆ టీజర్ లో నాగార్జున త్రిపాత్రాభినయం చేసి అందరినీ అలరించారు. దీంతో సీజన్ 4 హోస్ట్ కూడా నాగార్జునే అని తెలిసిపోయింది.
ఇక.. కంటెస్టెంట్లు ఎవరు? అనే ప్రశ్న అందరిలో మెదిలింది. అయితే.. సీజన్ 4 కంటెస్టెంట్లు వీళ్లే అంటూ సోషల్ మీడియాలో ఎన్నో పేర్లు హల్ చల్ చేసినప్పటికీ.. ఫైనల్ గా 14 మంది కంటెస్టెంట్ల పేర్లు ఖరారు అయినట్లు తెలుస్తోంది.
14 మందిని ముందుగా తీసుకొని ఆ తర్వాత ఇద్దరిని వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్ లోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. దీంతో మొత్తం 16 మంది ఇంటి సభ్యులు అవుతారు.
ఇక.. వీళ్లే ఫైనల్.. అంటున్న ఆ 14 మంది కంటెస్టెంట్లు ఎవరో మీరే చదవండి..
హంసా నందిని, సింగర్ సునీత, సింగర్ మంగ్లీ, నటుడు నందు, వైవా హర్ష, యామిని భాస్కర్, యూట్యూబర్ మహాతల్లి, యూట్యూబర్ మెహబూబా దిల్ సే, ప్రియా వడ్లమాని, సింగర్ నోయల్, అపూర్వ, జబర్దస్త్ నరేశ్, జబర్దస్త్ రామ్ ప్రసాద్, జానీ మాస్టర్.