Naveen polisetty: టాలీవుడ్లో విజయ్ దేవరకొండకు అర్జున్ రెడ్డి సినిమాతో అసాధారణమైన క్రేజ్తో పాటు రౌడీ హీరో అనే ఇమేజ్ వచ్చింది. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండకు టాలీవుడ్లో మాత్రమే కాదు బాలీవుడ్లోనూ మంచి క్రేజ్ నెలకొంది. అందుకే ఏకంగా పూరి జగన్నాథ్ ఇప్పుడు లైగర్ అనే పాన్ ఇండియన్ సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు. చెప్పాలంటే విజయ్ దేవరకొండ కంటే ముందు వచ్చిన ఏ హీరోకు రాని క్రేజ్ ఈ యంగ్ హీరో దక్కించుకున్నాడు. అయితే మళ్ళీ ఆ రేంజ్కు ఇంకో హీరో ఇప్పట్లో రాడని అందరూ అనుకున్నారు. కానీ, అంతకు మించి అనేట్టుగా నవీన్ పొలిశెట్టి వచ్చాడు.
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో మంచి గుర్తింపు తెచుకున్న నవీన్ పొలిశెట్టి జాతి రత్నాలు సినిమాతో సాలీడ్ హిట్ దక్కించుకున్నాడు. ఈ సినిమాతో క్రేజ్ మాత్రమే కాదు పెద్ద బ్యానర్స్ నుంచి భారీ అవకాశాలు దక్కించుకుంటున్నాడు. జాతి రత్నాలు సినిమా తర్వాత యూవీ క్రియేషన్స్లో, సితార ఎంటర్టైన్మెంట్స్ సహా మరికొన్ని పెద్ద నిర్మాణ సంస్థలలో నవీన్ పొలిశెట్టి అవకాశాలు దక్కించుకున్నాడని వార్తలు వచ్చాయి. అయితే కొవిడ్ కారణంగా ఈ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేయడం ఆలస్యం అయింది. దాంతో ప్రాజెక్ట్స్ ఆగిపోయాయని వార్తలు వచ్చాయి.
Naveen polisetty: ప్రభాస్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సపోర్ట్ గట్టిగా ఉందని టాక్..
కానీ, తాజాగా ఒకేసారి రెండు భారీ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేశారు. ముందు నుంచి వార్తల్లో నిలిచిన యూవీ ప్రొడక్షన్స్ సంస్థలో అనుష్క శెట్టి – నవీన్ పొలిశెట్టి ముఖ్య పాత్రలో సినిమాను అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు పి మహేశ్ దర్శకత్వం వహించనున్నాడు. ఇది విభిన్నమైన కథాంశంతో తెరకెక్కనుంది. ఇక ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైనెమెంట్స్ సంస్థలో ఓ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించారు. కళ్యాణ్ శంకర్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. త్రివిక్రం శ్రీనివాస్ సతీమని సాయి సౌజన్య సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ రెండు సినిమాల వెనక ప్రభాస్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సపోర్ట్ గట్టిగా ఉందని టాక్ వినిపిస్తోంది.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!