Anasuya: బుల్లితెరపై యాంకర్ గా రాణిస్తూ మరోపక్క ఇండస్ట్రీలో వరుస అవకాశాలు అనసూయ అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఒక్క టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాక సౌత్ ఇండస్ట్రీలో అనేక భాషలలో అనసూయ నటిస్తుంది. కేవలం సినిమాలు మాత్రమే కాకుండా ఐటెం సాంగ్స్ కూడా చేస్తూ స్టెప్పులతో ఎంటర్టైన్ చేస్తూ ఉంది. ఇలా కెరీర్ పరంగా అన్ని రకాలుగా.. సత్తా చాటుతా ఉండే అనసూయ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే.
ఏ విషయం గురించి నిర్మొహమాటంగా చెప్పే అనసూయ గత ఏడాది లాక్డౌన్ సమయంలో తన కుటుంబం గురించి భర్త భరద్వాజ్ గురించి అనేక విషయాలు చెబుతూ తన అభిరుచులు కూడా తెలియజేసింది. పెట్ లవర్ అని… అందువల్ల ఇంటిలో కుక్కలతో పాటు రామచిలకలు కూడా పెంచుకుంటున్నట్లు అప్పట్లో స్పష్టం చేసింది. ఇదిలావుంటే ఇటీవల తాజాగా అనసూయ గురించి ఓ ప్రముఖ మీడియా జనరల్ ఎంటర్టైన్మెంట్ లో అనసూయ ఎప్పుడు వైన్ తాగుతుంది అన్న దానిపై సరికొత్త న్యూస్ ప్రసారం చేసింది.
మేటర్ లోకి వెళ్తే… అనసూయ తనకి కోపం వస్తే.. ఆ రోజు రాత్రి వైన్ తాగి… తన భర్తకి బాధను తెలియజేస్తుందని అదేవిధంగా ట్రెండింగ్ గా ఉండేలా అనసూయకి నేర్పించింది భర్త భరద్వాజే అని తాజా వార్తలో సదరు మీడియా ఛానల్ స్పష్టం చేసింది. అదేవిధంగా సోషల్ మీడియాలో మొదటిలో తనని ట్రోలింగ్ చేసే సమయంలో చాలా బాధ అనిపించేది. ప్రస్తుతం అలవాటు అయిపోయింది అని అనసూయ చెప్పుకోచ్చిందట. ఏది ఏమైనా నా బాధ వచ్చినప్పుడు భర్త ముందే వైన్ తాగి అనసూయ తన బాధలు… చెప్పుకోవటం నిజంగా ప్రపంచంలో ఎక్కువ స్వేచ్ఛ కలిగిన భార్య అవార్డు అనసూయ కి ఇవ్వొచ్చని తాజా వార్త పై సోషల్ మీడియాలో నెటిజన్లు… కామెంట్లు చేస్తున్నారు.