Shobha Shetty: శోభా శెట్టి ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ కి ప్రేక్షకులు పెట్టుకున్న పేరు మరొకటి ఉంది.. అదే మౌనిత. కార్తీకదీపం అనే సీరియల్ తో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు పొందిన ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ 7 అనే కార్యక్రమంలో పాల్గొని తన వంతు సందడి చేసింది. అంతేకాకుండా బిగ్బాస్ హౌస్ లో కూడా మౌనిత అనే ఓ బిరుదును సంపాదించుకుంది.
తన గద్దరి తనంతో ప్రతి ఒక్క కంటెస్టెంట్ ని ఇబ్బంది పెడుతూ శోభా శెట్టి కాస్త మౌనిత అయిపోయింది. ఇక ఈ ముద్దుగుమ్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మొదటి రోజు నుంచి.. ఈమె బయటకి వచ్చే ఆఖరి రోజు వరకు ఈమె మీద ప్రతి రోజు ఏదో ఒక మీన్స్ వేస్తూనే ఉండేవారు ట్రోలర్స్. ఇక ఈ ముద్దుగుమ్మ బిగ్బాస్ హౌస్ వేదికగా తన ప్రియుడిని ప్రతి ఒక్కరికి పరిచయం చేసి పెద్ద షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు.
కార్తీకదీపం లో నిరుపం కి తమ్ముడు క్యారెక్టర్ చేసిన యశ్వంత్ రెడ్డి ని తాజాగా ఎంగేజ్మెంట్ చేసుకొని మరోసారి తన ఫాన్స్ కి షాక్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక వీరిద్దరూ పలు షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించారు. ఆ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడినట్లు తెలుస్తుంది. ఇక యశ్వంత్ కి మొదటిగా శోభా శెట్టి నే ప్రపోజ్ చేసింది అట.
ఇక బెంగళూరులోని శోభా శెట్టి ఇంట్లో వీరిద్దరి ఎంగేజ్మెంట్ నిన్న చాలా సింపుల్ గా చేసుకున్నారు. దండలు మార్చుకుంటున్న ఫోటోలు తన సోషల్ మీడియా ఎకౌంట్లో షేర్ చేసింది శోభ. ఇక వీరిద్దరూ గుట్టు చప్పుడు కాకుండా ఇలా నిచ్చుతార్థం చేసుకోవడానికి అసలు కారణమేంటో తెలియాల్సి ఉంది. ఇక వీళ్ళ ఎంగేజ్మెంట్ ఫొటోస్ చూసిన ప్రేక్షకులు..” శోభాశెట్టి మీద దారుణంగా ట్రోల్స్ వస్తున్నాయి. ఈ ట్రోల్స్ వల్ల వాళ్ళిద్దరి అనుబంధం పోతుందేమోనని కంగారుపడినట్టుంది ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.