Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ “దేవర” ఏప్రిల్ 5వ తారీఖు విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అధికారిక ప్రకటన చేయడం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి గ్లింప్స్ వీడియో సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేయడం జరిగింది. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన దివంగత శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ దాదాపు 80 శాతానికి పైగానే కంప్లీట్ జరిగింది. ఇంక చిత్రం ఫైనల్ స్టేజ్ లో షూటింగ్ జరుగుతుండగా విలన్ పాత్ర చేస్తున్న సైఫ్ అలీ ఖాన్ గాయాలు పాలు కావడం జరిగింది.
షూటింగ్ చేస్తున్న సమయంలోనే యాక్షన్స్ సన్నివేశాలలో సైఫ్ అలీ ఖాన్ మోచేయి మరియు కాలికి గాయం కావడం జరిగింది అంట. దీంతో హుటాహుటిన సినిమా యూనిట్ ముంబై హాస్పిటల్ లో.. జాయిన్ చేయడం జరిగింది. ఈ క్రమంలో వైద్యులు సర్జరీ చేయాలని తెలపడంతో ఇప్పుడు పరిస్థితులు మొత్తం అన్ని తారుమారయ్యాయి. ఎందుకంటే ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ కి సంబంధించి పలు కీలకమైన యాక్షన్ సీన్స్ చిత్రీకరించాల్సి ఉందంట. కాగా షూటింగులో బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ కి గాయాలైనట్లు మూవీ టీమ్ ప్రకటించింది. ఈ క్రమంలో సైఫ్ త్వరగా కోలుకుని సెట్స్ లోకి రావాలని ఆకాంక్షిస్తున్నట్లు ట్వీట్ చేసింది.
అయితే ప్రమాదం ఎలా జరిగింది? సైఫ్ కి గాయాల తీవ్రతపై క్లారిటీ ఇవ్వలేదు. అలీఖాన్ కి గాయం కావడంతో తాత్కాలికంగా ఆగిపోయినట్లు తెలుస్తోంది. దీంతో ముందుగా ప్రకటించినట్లు ఏప్రిల్ 5న ‘దేవర’ రిలీజ్ కావడం కష్టమని సినీ వర్గాలు చెబుతున్నాయి. సైఫ్ కోలుకొని సెట్స్ కి వచ్చేవరకూ ఆయన పాత్ర చిత్రీకరణ కుదరదని, షెడ్యూల్ లో చాలా మార్పులొస్తాయంటున్నాయి. దీంతో ఏప్రిల్ 5వ తారీఖు విడుదలవుతుందని అనుకున్నా లెక్కలు మొత్తం ఇప్పుడు తారు మారాయి. సైఫ్ కి సర్జరీ కావడంతో కనీసం రెండు నెలలు విశ్రాంతి తీసుకునే అవకాశం ఉందని.. నెక్స్ట్ జూన్ లేదా జూలైలో సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!