విశాల్, వరలక్ష్మి మంచి స్నేహితులన్న సంగతి ప్రపంచానికే తెలుసు. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారని ఇప్పటికే చాలా సార్లు వార్తలు వినిపించాయి. వాటిని వారిద్దరు కూడా కొట్టిపారేశారు. విశాల్కు అనీశారెడ్డితో ఎంగేజ్మెంట్ కూడా పూర్తయింది. వరలక్ష్మి ఇంకా పెళ్లి ప్రస్తావన తీసుకుని రావడం లేదు. విశాల్ పెళ్లి తర్వాత వీరిద్దరి మధ్య స్నేహం పూర్వంలాగానే ఉందా? అని చాలా మందికి డౌట్. ఇప్పుడు ఆ అనుమానాలు పటాపంచలయ్యే విధంగా వరలక్ష్మి ప్రవర్తన నిలిచింది. నడిగర్ సంఘం ఎన్నికల్లో పాండవర్ అని తరఫున విశాల్ పోటీ చేస్తున్నారు. ఆయనకు వ్యతిరేకంగా భాగ్యరాజ్ పోటీ చేస్తున్నారు. తాజాగా సభ్యుల ఓట్ల కోసం విశాల్ ఓ వీడియో చేశారు. అందులో రాధారవిని, వరలక్ష్మి తండ్రి శరత్కుమార్ను కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారు. వాటి గురించి వరలక్ష్మి తీవ్రంగా స్పందించింది. “ఇన్నాళ్లూ నువ్వు ఏం చేసినా నీ పక్కనే ఉన్నాను. గత ఎన్నికల్లోనూ నా తండ్రిని కించపరిచావు. కానీ ఆయన మీద మోపిన నేరాలేవీ రుజువు కాలేదు. ఈ సారి మా నాన్న పోటీలో కూడా లేరు. అయినా ఆయన్ని ఎందుకు లాగుతున్నావు. ఇలాంటి ప్రవర్తన వల్ల నా ఓటును కూడా కోల్పోయావు“ అని ట్విట్టర్లో వెల్లడించారు. రాధా రవి నటి రాధికకు అన్నయ్య అనే విషయం తెలిసిందే. శరత్కుమార్ రాధిక దంపతులన్న విషయం కూడా తెలిసిందే.
previous post
next post