Rajamouli: సాధారణంగా స్టార్ హీరో సినిమా అంటే మిక్స్డ్ టాక్ అందుకున్నప్పటికీ బ్లాక్ బస్టర్ రేంజ్ లో వసూళ్లు రాబడతాయి. ఇక తాజాగా కూడా ఇదే జరిగింది. మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీ లీల మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ” గుంటూరు కారం ” మూవీ మిక్స్డ్ టాక్ దక్కించుకున్నప్పటికీ మంచి వసూళ్లతో దూసుకుపోతుంది.
సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షోకే దారుణమైన టాక్ ని చవిచూసింది. మొదటి వారంలో ఈ సినిమా రూ.212 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. సంక్రాంతి పండగను మహేష్ బాగానే వాడుకున్నాడని చెప్పొచ్చు.
ఇక తాజాగా ఈ సినిమాను దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి వీక్షించడం జరిగింది. ఏఎంబి థియేటర్లో కీరవాణితో కలిసి జక్కన్న గుంటూరు కారాన్ని వీక్షించాడు. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో జక్కన్న నిలబడి ఓ విచిత్రమైన ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు.
ఇది చూసిన ప్రేక్షకులు..” రాజమౌళి కి ఏదో తేడా కొట్టినట్టుంది? అంత గొప్ప దర్శకుడిని తీసుకెళ్లి ఆ చెత్త సినిమా చూపించడమేంటో? త్రివిక్రంపై జక్కన్న కి ఉన్న ప్రాముఖ్యత మొత్తం పోయినట్లేగా.. జక్కన్న ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే తన నెక్స్ట్ సినిమా లో మహేష్ ని ఓ రేంజ్ లో చూపించేదట్టున్నాడే ” అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు ప్రేక్షకులు. ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయి.
Video #GunturKaaram #SSRajamouli 👍 pic.twitter.com/nkaUnwaKWv
— Nikhil_Prince🚲 (@Nikhil_Prince01) January 20, 2024