నాగబాబు.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఈయనకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఒక మెగాస్టార్ తమ్ముడిగానే కాకుండా.. తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు నాగబాబు. ప్రస్తుతం నాగబాబు.. ఆయన కూతురు నిహారిక పెళ్లి పనుల్లో బిజీబిజీగా రాజస్థాన్ లో ఉన్నప్పటికీ.. తన యూట్యూబ్ చానెల్ ను మాత్రం యాక్టివ్ గానే ఉంచుతున్నారు.
తన టీమ్ ఎప్పుడూ ఏదో ఒక సరికొత్తగా చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఇటీవల నాగబాబు.. స్టాండ్ అప్ కామెడీ పేరుతో ఓ షోను ప్రారంభించారు. తన యూట్యూబ్ చానెల్ లోనే ఖుషీ ఖుషీగా పేరుతో ఓ స్టాండ్ అప్ కామెడీని స్టార్ట్ చేశారు. ఆ షోకు సంబంధించిన ఓ ప్రోమోను ఇటీవల విడుదల చేయగా… ఆ ప్రోమోకు మంచి రెస్పార్స్ వచ్చిందంటూ ఆయన మరో వీడియోలో చెప్పుకొచ్చారు.
అంతే కాదు.. ఖుషీ ఖుషీగా షోను ఎందుకు స్టార్ట్ చేశారు.. దానికి కారణాలేంటి? అనే విషయాలను కూడా నాగబాబు ఆ వీడియోలో తన అభిమానులతో పంచుకున్నారు.
అలాగే.. ఖుషీఖుషీగా ప్రోమో విడుదలయిన తర్వాత కొన్ని నెగెటివ్ కామెంట్లు వచ్చాయని.. ఈ ప్రపంచం ముందుకెళ్తున్నప్పుడు ప్రతి పనికిమాలిన ఎదవ, పనికిమాలిన సన్నాసి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తారు కాబట్టి పెద్దగా వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాటిని మా మైండ్ లోకి కూడా తీసుకోం.. అంటూ నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.
నాగబాబు షోకు అంత ఘోరంగా నెగెటివ్ కామెంట్లు ఎవరు పెట్టారు? అనేదానిపైనే ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఎంత ఘోరంగా కామెంట్లు పెట్టకపోతే.. ఎందుకు నాగబాబు అంతలా రెస్పాండ్ అవుతారు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది.
ఏది ఏమైనా.. ఆరోగ్యకరమైన వినోదాన్ని పంచేందుకు ఒక మంచి ప్లాట్ ఫాంను తీసుకొస్తున్నప్పుడు ఇలా నెగెటివ్ గా కామెంట్లు చేయడం కరెక్ట్ కాదంటూ కొందరు నెటిజన్లు.. నెగెటివ్ కామెంట్లపై పాజిటివ్ గా స్పందిస్తున్నారు.