కరోనా మహమ్మారి దెబ్బకు కొత్త సంవత్సరం వేడుకలకు బ్రేక్ పడింది. ఈ వైరస్ రూపాంతరం చెంది సరికొత్తగా మారి విలయతాండవం సృష్టించేందుకు రెడీ అయిపోయింది అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కరోనా కొత్త స్ట్రైన్ వల్ల భారత దేశంలోని పలు రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. ఇక బ్రిటన్ పై నుండి వచ్చే విమానాలు, బ్రిటన్ నుండి వచ్చే విమానాలపై తాత్కాలిక నిషేధం విధించారు.
ఇక ఈ కరోనా ను నియంత్రించడానికి అనేక రాష్ట్ర ప్రభుత్వాలు నూతన సంవత్సర వేడుకలకు ముందు మార్గదర్శకాలను ప్రకటించాయి. మహారాష్ట్ర ప్రభుత్వం ఈనెల 31 నుండి జనవరి 5 వరకు రాత్రి 11 గంటల నుండి 16 వరకు కర్ఫ్యూ విధించింది. ఇక ముంబై-పూణే తో పాటు మిగతా పెద్ద నగరాల్లో బహిరంగంగా నూతన వేడుకలను అనుమతించడం లేదు. కర్ణాటకలో గురువారం సాయంత్రం 6 గంటల నుండి ఉదయం ఆరు గంటల వరకూ కర్ఫ్యూ విధించడంతో పాటు క్లబ్, రెస్టారెంట్లలో జనవరి 2 వరకు నిషేధం విధించారు.
తమిళనాడులో కూడా బీచ్ రిసార్ట్, రెస్టారెంట్స్, క్లబ్ లు వంటివాటిపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఇక హిమాచల్ ప్రదేశ్ లో జనవరి 5 వరకు రాత్రి కర్ఫ్యూ విధించారు. రాజస్థాన్ ప్రభుత్వం గురువారం రాత్రి నుండి శుక్రవారం రాత్రి వరకు కర్ఫ్యూ విధించింది. అలాగే బహిరంగ ప్రదేశాల్లో నూతన సంవత్సర పార్టీలు అని చెప్పి పటాకులు పేల్చడం కూడా నిషిద్ధం. ఉత్తరాఖండ్ లో హోటల్స్, బార్స్, రెస్టారెంట్లు…. ఇతర బహిరంగ ప్రదేశాల్లో నూతన సంవత్సర వేడుకలకు అనుమతి ఇవ్వలేదు. డెహ్రాడూన్ పరిపాలన ప్రాంతంలో కూడా అనుమతి లభించలేదు.