ప్రస్తుతం ఈ కరోనా పోరు పడలేకున్నాం అనుకుంటే…. దానిని మించి అన్నట్లు కొత్తగా యుకే కరోనా స్ట్రైన్ వైరస్ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది. కంటికి కనిపించని సూక్ష్మమైన కరోనా తన రూపాన్ని, తీరుని మార్చుకున్న కొత్త విషయం తెలిసినప్పటి నుండి ప్రపంచ దేశాలకు ఇదొక కొత్త తలనొప్పిగా మారింది. పైగా పేరెంట్స్ వైరస్ తో పోలిస్తే ఇది 60 నుండి 70 శాతం వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఉన్న కొత్త వైరస్ కావడం మరింత ఆందోళనకర విషయం.
ఈ సమయంలో ఈ కొత్త వైరస్ భారత్ వచ్చేయడం…. అలాగే తెలంగాణ రాష్ట్రంలోని ప్రజల్లో బయటపడడం కొద్దిగా భయపెట్టే అంశమే. బ్రిటన్ నుండి వచ్చిన వారిలో 40 మందికి పాజిటివ్ ఆ శ్యాంపిల్స్ ను సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) సంస్థ విశ్లేషించింది. వీటిల్లో 20 శాంపిల్స్ లో ముగ్గురుకి యుకే వైరస్ సోకినట్లు గుర్తించారు. ఇలాంటి వేళ సిసిఎంబి డైరెక్టర్ రాకేశ్ మిశ్రా చెప్పిన మాటలు మాత్రం కొద్దిగా ఊరటను కలిగించాయి అనే చెప్పాలి.
కొత్త వైరస్ వచ్చేసింది అని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని…. పెద్ద ఎత్తున పరీక్షలు జరపడం అత్యవసరం అని ఆయన అన్నారు. కరోనా కారణం ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో వీటితో ను అవే సమస్యలు వస్తాయని చెప్పారు. ఈ వైరస్ వ్యాప్తి చెందే వేగం ఎక్కువగా ఉంటుంది కానీ ఎప్పుడూ మనం తీసుకునే జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని అన్నారు. ఆందోళన కంటే అప్రమత్తత ఈ సమయంలో ఎంతో ముఖ్యం అని సిసిఎంబి డైరెక్టర్ మాటలు పరిగణలోకి తీసుకుంటే ఈ వైరస్ దూకుడుకు కళ్లెం వేయవచ్చు.