ఆంధ్రప్రదేశ్ స్టేట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టాలన్న దృక్పథంతో హైకోర్టు ఆదేశాల మేరకు ప్రస్తుతం గవర్నర్ ఆఫీసులో ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో సమావేశం అయి ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు వైసీపీ ప్రభుత్వం షాక్ ఇచ్చేలా కనబడుతోంది. కొత్త ఆర్డినెన్స్ తీసుకొనివచ్చి నిమ్మగడ్డను స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గా తప్పించిన జగన్ ప్రభుత్వానికి మళ్లీ ఆయనను తన పదవిలో అపాయింట్ చేయమని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను బేఖాతర్ చేసిన ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు హై కోర్టు తీర్పు పై స్టే ఇచ్చేందుకు తిరస్కరించినా.. మరొకసారి ఏపీ ప్రభుత్వం నిమ్మగడ్డ పిటిషన్ ధిక్కరణ పై స్టే ఇవ్వాలని ఆశ్రయించింది.
పరిస్థితి చేయి దాటి పోతుందని భావించిన వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఈ విషయంపై మరలా పట్టు బిగించ అన్నది రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. పట్టువదలకుండా వారు నిమ్మగడ్డ విషయంలో ఇంత పట్టుదలతో ఎందుకు వ్యవహరిస్తున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. మొత్తానికి రాష్ట్ర రాజకీయాలు మరోసారి రసకందాయంలో పడ్డాయి.