ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేడు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను గవర్నర్ ఆఫీస్ లో కలిసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో లో చర్చలు సమాప్తం అయిన అనంతరం నిమ్మగడ్డ బయటకు వచ్చి ఒక ప్రెస్ నోట్ ను విడుదల చేశారు. అతను మళ్ళీ తిరిగి ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు చేపట్టేందుకు అవసరమైన వివరణను మొత్తం ఇచ్చాను అని మరియు గవర్నర్ ఓపికగా మొత్తం విన్నారని నిమ్మగడ్డ చెప్పారు.
ఇక తన నియామకం విషయమై గవర్నర్ పరిశీలించి తనకు ఒక సమాధానం త్వరలోనే ఇస్తానని చెప్పినట్లు నిమ్మగడ్డ ప్రెస్ నోట్ ద్వారా తెలియజేశారు. త్వరలోనే గౌరవనీయులైన గవర్నర్ గారి ఆదేశాలతో రాష్ట్ర తిరిగి ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు చేపడతారని ఆశాభావం వ్యక్తం చేశారు నిమ్మగడ్డ.