బిగ్ బాస్ 4 మొదలైనప్పుడు కంటెస్టెంట్ల విషయంలో పెదవి విరిచిన వారే ఎక్కువ. ముఖ్యంగా తెలియని ముఖాలు ఎక్కువ ఉన్నాయని, టిక్ టాక్ స్టార్స్ ను ఎక్కువగా తీసుకొచ్చారని రకరకాల విమర్శలు వచ్చాయి. మెహబూబ్, దివి, ఇస్మార్ట్ సోహైల్, అరియనా, అలేఖ్య హారిక, అఖిల్ లాంటి వారు ఎవరు అంటూ ట్రోల్స్ చేసిన వాళ్ళు ఎక్కువమందే ఉన్నాయి.
అయితే షో మొదలైన మొదటి రెండు, మూడు రోజులు అందరూ ఎవరికి తోచినట్లుగా వారు ప్రవర్తించి, మాట్లాడి ఎపిసోడ్ ఫుటేజ్ లో పడ్డారు. వీరిలో దివి మాత్రం ముందు నుండీ చాలా కామ్ గా ఉంది. జనాలను అబ్సర్వ్ చేయడమే తన పని అన్నట్లుగా ఎక్కువగా ఎవరితోనూ కలవలేదు. ఈలోగా నామినేషన్స్ లోకి కూడా వచ్చింది. అసలు ఆమె పెర్ఫర్మ్ చేసేది కాదు అసలు చేసింది కూడా ఏమీ లేకపోవడంతో ఫస్ట్ ఎలిమినేట్ అయ్యేది దివినే అని చాలా మంది ఫిక్స్ అయిపోయారు. అయితే ఒకే ఒక్క ఎపిసోడ్ ఆమె గ్రాఫ్ ను పూర్తిగా మార్చేసింది.
ఇంటి సభ్యులందరి గురించి తాను అబ్సర్వ్ చేసినవి చెప్పాలంటూ బిగ్ బాస్ టాస్క్ ఇవ్వడం ఆమె పాలిట వరంగా మారింది. ఒక్కొక్కరి గురించి క్షుణ్ణంగా తాను అబ్సర్వ్ చేసిన అంశాలను దివి చెప్పిన తీరుకి నాగార్జున కూడా హ్యాట్సాఫ్ అన్నారు. వాళ్ళ గురించి నెగటివ్ పాయింట్స్ చెప్పినా ఆయా కంటెస్టెంట్స్ హర్ట్ అవ్వకుండా చెప్పడం నిజంగా హైలైట్.
అంతే కాకుండా కట్టప్ప గురించి సోహైల్, అరియనాలకు చెప్పమన్నప్పుడు నోయెల్, లాస్య సహా ఆరుగురైదుగురు అదేదో సీక్రెట్ టాస్క్ అనుకుని అందులో పార్టిసిపేట్ చేయలేదు. కానీ దివి మాత్రం మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారు అంటూ కుండ బద్దలు కొట్టింది. ఈ ఎపిసోడ్ తో దివి ఫేట్ మారిపోయింది. ఈరోజు ఆమె సేఫ్ అవుతుంది. మొదటి నుండి అతి చేస్తూ వచ్చిన సూర్య కిరణ్ ఎలిమినేట్ అవుతున్నాడు. అతని స్థానంలో వైల్డ్ కార్డ్ ద్వారా కమెడియన్ సాయి కుమార్ ఎంట్రీ ఇవ్వనున్నాడు.