ఇటీవల డ్రాగన్ కంట్రీ ఇండియాకి చెందిన 20 మంది సైనికులను పొట్టన పెట్టుకోవటం అందరికీ తెలిసిందే. చైనా ఇండియా సరిహద్దు ప్రాంతంలో లడక్ ప్రాంతం దగ్గర డ్రాగన్ కంట్రీ ఆర్మీ గొడవలకు పాల్పడటంతో రెచ్చగొట్టే విధంగా చైనా చర్యలు చేయడంతో రెండు దేశాలకు చెందిన సైనికుల మధ్య గొడవ చోటు చేసుకుంది. దీంతో జరిగిన గొడవలో భారత్ సైనికులు తో పాటు చైనా సైనికులు కూడా చనిపోవడం జరిగింది.
దీంతో ఇండియన్ గవర్నమెంట్ చైనా దేశానికి చెందిన యాప్స్ మొత్తం బ్యాన్ చేయటం ఇటీవల మనం చూశాం. తాజాగా ఈ విధంగానే పాకిస్తాన్ దేశ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ చైనా మరియు దక్షిణ కొరియా రూపొందించిన పబ్జి గేమ్ ని ఆ దేశంలో బ్యాన్ చేశారు. వాస్తవానికి చైనాతో గాని దక్షిణ కొరియాతో గాని పాకిస్తాన్ కి ఎటువంటి గొడవలు లేకపోయినా..పబ్జీ గేమ్ నిషేధించడానికి కారణం ఆ దేశంలో ఉన్న యువకులతో పాటు పిల్లలు ఎక్కువగా చదువుకోకుండా టైమ్ అంత ఆ గేమ్ కి కేటాయిస్తున్నారట. అంతేకాకుండా నేర ప్రవర్తన కూడా ఉన్న కొద్ది వారిలో పెరుగుతుందంట. దీంతో పాకిస్తాన్ దేశం పబ్జీ గేమ్ ని బ్యాన్ చేసినట్లు ప్రధాని ఇమ్రాన్ అధికారికంగా ప్రకటించడం జరిగింది.