Air conditioning:ఎండలు మండిపోతున్నాయి అని రోజంతా ఏసీ రూముల్లో కూర్చుంటున్నారా..? అయితే ఈ విషయాలు తెలుసుకోండి. సూర్యుని వెలుతురు గదిలోకి రానివ్వకుండా , సూర్య కిరణాలు శరీరంపై పడకుండా.. ఏసీ గదుల్లో గంటల పాటు తరబడి కూర్చునే వారిలో అనేక రుగ్మతలు కలుగుతాయి అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఏసీ గదుల్లో గంటల పాటు కూర్చు నే వారిలో విటమిన్ డి లోపం ఏర్పడుతుంది అని తెలియ చేస్తున్నారు. దీనితో పాటు హృద్రోగాలు,ఊపిరితిత్తులు సక్రమంగా పనిచేయకపోవడం వంటి సమస్యలు కూడా వచ్చే ప్రమాదం వుందట.
విటమిన్ డి శరీరానికి సరిపడినంత అందాక పోవడం వలన ఎముకలు ఎముకల బలహీనమవుతాయి.. మోకాలి నొప్పి, వెన్ను నొప్పి వంటి రుగ్మతలు కూడా తప్పదని హెచ్చరిస్తున్నారు. కొందరికి ఆస్తమా, తలనొప్పి వంటివి తప్పవని మధుమేహం ఉన్నవారు ఏసీల్లో కూర్చోకపోవడం మంచిది అని.. తరచూ ఏసీలో ఉండే వారి చర్మం పొడిబారి పోతుందని డాక్టర్లు తెలియచేస్తున్నారు.
ఏసీల్లో గంటల పాటు కూర్చు నే వారికి జుట్టు ఊడే సమస్య కి జుట్టు ఎక్కువగా ఊడిపోతుంటుంది. ఏసీ గదుల్లో గంటల పాటు కూర్చుని గడిపే వారి చర్మం త్వరగా ముడతలు పడే అవకాశం వుంది. ఏసీలను శుభ్రం చేయకుండా ఉపయోగిస్తే చర్మానికి బ్యాక్టీరియా సోకుతుంది కూడా . అదే ఆఫీస్ ఏసీల్లో ప్రతి రోజు ఉండేవారు జలుబు, దగ్గు వంటి రుగ్మతల ఉండేవారి పక్కన కూర్చోకపోవడం ఆరోగ్యానికి మంచిది .
అలాగే ఏసీ నేరుగా తగిలేలా కూర్చుని పనిచేయడం వంటివి చేయకూడదు. అలా చేస్తే మాత్రం సైనస్ సమస్య కచ్చితంగా వస్తుంది. సోరియాసిస్, ఎక్సిమా వంటి చర్మ సమస్యలున్నవారు ఏసీల్లో ఎక్కువ సమయం గడపకూడదు . ఏసీల్లో కూర్చోవడం తప్పదు అని అనుకుంటే మాత్రం ఉదయం, సాయంత్రం పూట విటమిన్ డి పడేలా గంట సేపు సూర్యుని వేడి తగిలేలా నిలబడాలి అని ఆయుర్వేద నిపుణులు సైతం సూచిస్తున్నారు .