Corona: దేశవ్యాప్తంగా కరోనా కలకలం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలు సైతం వణికిపోతున్నాయి. గత ఏడాది కోవిడ్ కేసులకు హాట్స్పాట్గా ఉన్న గ్రేటర్ హైదరాబాద్లో ఇప్పుడు కోవిడ్ సెకండ్ వేవ్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. తెలంగాణలో నమోదు అవుతోన్న పాజిటవ్ కేసుల్లో మెజార్టీ సంఖ్య హైదరాబాద్ లో వెలుగు చూస్తోంది. దీంతో కోవిడ్ కట్టడి చర్యలకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పూనుకుంది.
హైదరాబాద్ లో కీలక నిర్ణయం
కరోనా కేసులు పెద్ద ఎత్తు పెరుగుతున్న నేపథ్యంలో ముందస్తు చర్యలకు జీహెచ్ఎంసీ పూనుకుంటుంది. జీహెచ్ఎంసీ 30 సర్కిళ్ల పరిధిలో మొత్తం 63 మినీ కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసింది. ఐదు పాజిటివ్ కేసుల కంటే ఎక్కువగా ఉంటే మినీ కంటైన్మెంట్ జోన్ను ఏర్పాటు చేస్తారు.. ఒకే అపార్ట్మెంట్లో కేసులు వస్తే హౌజ్ క్లస్టర్ ఏర్పాటు చేయనున్నారు.. ఈ క్లస్టర్ పరిధిలో బారికేడ్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కేవలం శానిటేషన్, మున్సిపల్ సిబ్బంది, వైద్యారోగ్య శాఖ సిబ్బందిని మాత్రమే అనుమతించనున్నట్లు తెలిపింది.
ఇది ఇప్పుడు పరిస్థితి..
కాగా తెలంగాణలో కొత్తగా 5,567 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 3.73 లక్షలకు చేరింది. ఇందులో 3.21 లక్షల మంది డిశ్చార్జ్ కాగా, 49,781 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక రాష్ట్రంలో కొత్తగా కరోనాతో 23 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1899కి చేరింది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ తీసుకున్న నిర్ణయం ఎంతో మేలు చేసత్ఉందని పలువురు అంచనా వేస్తున్నారు.