NewsOrbit
న్యూస్

తిరుపతిలో గెలిచే బీజేపీ ఎంపీ కేంద్ర మంత్రి అట!నయా ప్రచారం చేపట్టిన రిటైర్డ్ ఐఏఎస్!

ప్రకాశం జిల్లా కలెక్టర్గా పనిచేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాసులు తిరుపతి ఎస్సీ రిజర్వుడు లోక్సభ బిజెపి టిక్కెట్ రేసులో ముందు వరుసలో ఉన్నట్లు కనిపిస్తోంది .ఈ క్రమంలో ఆయన సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారు.

ముఖ్యంగా ఈరోజు శ్రీనివాసులు ఫేస్బుక్లో పెట్టిన ఒక పోస్టింగ్ అందరినీ ఆకర్షిస్తోంది.తిరుపతిలో బీజేపీని గెలిపిస్తే ఆ ఎంపీ కేంద్ర మంత్రి అవుతాడని దాసరి శ్రీనివాసులు పేర్కొన్నారు.వైసీపీని గెలిపిస్తే 21 మందికి ఇంకొకడు అదనంగా చేరతారని,అదే బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే కేంద్ర మంత్రి అయి తిరుపతి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు తేగలుగుతాడని శ్రీనివాసులు ఆ పోస్టింగులో చెప్పారు.ఇది వినడానికి అతిశయోక్తిగా ఉన్నప్పటికీ దాసరి శ్రీనివాసులు వ్యూహాత్మకంగానే బిజెపికి అనుకూలించేలాగ ఈ ప్రచారం చేపట్టినట్టు కనిపిస్తోంది.సిట్టింగ్ వైసిపి ఎంపి బల్లి దుర్గా ప్రసాద్ రావు ఆకస్మిక మరణంతో త్వరలో తిరుపతి లోక్సభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుండటం తెలిసిందే.

ఇప్పటికే ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి ఖరారయ్యారు.వైసిపి అభ్యర్థిగా ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ గురుమూర్తి పోటీ చేసే అవకాశాలు మెండు.వైసిపి అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర సమయంలో గురుమూర్తి ఆయన వెన్నంటే ఉండి ఫిజియోథెరపిస్టుగా సేవలందించిన నేపథ్యంలో ఆయనకు తిరుపతి లో పార్టీ టిక్కెట్టు ఇవ్వనున్నట్టు ఇప్పటికే లీకులు వచ్చేశాయి.అధినేత తలుచుకుంటే జరగనది ఏదీ ఉండదు కాబట్టి వైసిపి అభ్యర్థి గురుమూర్తి అనే రాసేసుకోవచ్చు.ఇక బీజేపీ విషయానికొస్తే ఆ పార్టీ ఇక్కడ పోటీ చేయాలని పట్టుదలగా ఉంది.తెలంగాణలో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలో గెలవడం గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార పార్టీకి దగ్గరగా రావడం వంటి పరిణామాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ తన సత్తా చుాపడానికి తిరుపతి లోక్సభ నియోజకవర్గాన్ని వేదికగా ఎంచుకుంది.

అయితే బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పార్టీ జనసేన కూడా తిరుపతిని అడుగుతున్నప్పటికీ ఇప్పటికే ఈ సీటుపై బీజేపీ కర్చీఫ్ వేసేసినట్లు కనిపిస్తోంది.దీంతో తిరుపతిలోనే నివాసమేర్పరుచుకున్న దాసరి శ్రీనివాసులు రేసులో ముందుకు వచ్చేశారు.దళితులు,గిరిజనుల అభ్యున్నతికి దాసరి శ్రీనివాసులు ఐఏఎస్ హోదాలో అనేక కార్యక్రమాలు నిర్వహించారు.తూర్పుగోదావరి జిల్లాలో ఒకసారి ఐఏఎస్ అధికారులను నక్సలైట్లు కిడ్నాప్ చేయగా వారిలో ఉన్న దాసరి శ్రీనివాసులును అందరికన్నా ముందే విడుదల విడుదల చేశారు.ఆయన ట్రాక్ రికార్డు తెలుసుకున్న నక్సలైట్లు దాసరి శ్రీనివాసులుకు గౌరవమిచ్చి ముందే పంపేశారని అప్పట్లో వార్తలొచ్చాయి. అభ్యర్థి పరంగా చూస్తే దాసరి శ్రీనివాసులు బీజేపీకి స్ట్రాంగ్ క్యాండిడేట్ రాజకీయ పరిశీలకులు కూడా చెబుతున్నారు.

 

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N