చిత్తూరు: చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో పర్యావరణ పరిరక్షణకై ప్లాస్టిక్ వ్యర్ధాలను పూర్తిగా నియంత్రించేందుకు వైసిపి ఎమ్మెల్యే, ఏపిఐఐసి చైర్పర్సన్ ఆర్కె రోజా వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. హానికర ప్లాస్టిక్పై సమరాన్ని రోజా ప్రారంభిస్తున్నారు.
‘కిలో ప్లాస్టిక్ వ్యర్ధాలను అందించండి – కిలో బియ్యం పట్టుకెళ్లండి’ అంటూ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. తన జన్మదినం రోజైన నవంబర్ 17 నుండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి వైసిపి అధినేత జగన్మోహనరెడ్డి జన్మదిన వేడుక వరకూ 40 రోజుల పాటు కొనసాగించనున్నట్లు రోజా తెలిపారు. ‘నో ప్లాస్టిక్- న్యూ నగరి’ అన్న నినాదంతో కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళుతున్నానని చెప్పారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా రోజా కరపత్రాలను విడుదల చేశారు.
‘నగరిని హానికర ప్లాస్టిక్ వ్యర్ధాలు లేని స్వచ్చ్ నగరిగా మారుద్ధాం, మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం, అందరికీ ఆదర్శనంగా నిలుద్దాం’ అని రోజా విజ్ఞప్తి చేశారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా అనంతపురం జిల్లా గుంతకల్లు మున్సిపాలిటీలో ఇటీవల కేజీ ప్లాస్టిక్ వ్యర్థాలకు ఆరు కోడిగుడ్ల పంపిణీ చేపట్టిన విషయం తెలిసిందే.
నగరిని హానికర ప్లాస్టిక్ వ్యర్ధాలు లేని స్వచ్చ్ నగరిగా మారుద్దాం.
మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం..
అందరికీ ఆదర్శంగా నిలుద్ధాం..#SayNoToSingleUsePlastic #NoPlasticNewNagari #Nagari #RojaSelvamani pic.twitter.com/g9cvfwok3L
— Roja Selvamani (@RojaSelvamaniRK) November 15, 2019