PV Sindhu: భారత బ్యాడ్మింటన్ స్టార్ తెలుగు తేజం పీవీ సింధు టోక్యో ఒలింపిక్స్ మహిళల సింగిల్స్ విభాగంలో కాంస్య పతకాన్ని సాధించడం తో రాజకీయ ప్రముఖులతో పాటు సెలబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వరుసగా రెండు ఒలంపిక్స్ లలో మెడల్ సాధించడంతో ఇండియన్ క్రీడా విభాగంలో పీవీ సింధు సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ సందర్భంగా ప్రస్తుతం వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో.. పార్లమెంట్ అదేరీతిలో రాజ్యసభ కి చెందిన ఎంపీలు.. పీవీ సింధు సాధించిన రికార్డు పట్ల అభినందనలు తెలియజేశారు.
సభ ప్రారంభమైన వెంటనే లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా పీవీ సింధు సాధించిన ఘనత పట్ల ప్రస్తావిస్తూ.. అభినందనలు తెలియజేశారు. పీవీ సింధు కాంస్య పతకాన్ని సాధించటం ఎంతో సంతోషకరమైన విషయం అని తెలిపారు. వరుసగా రెండు మెడల్స్ వ్యక్తిగత ఖాతాలో పీవీ సింధు సాధించటం హిస్టరీ అని కొనియాడారు. అదేరీతిలో పీవీ సింధు గెలుపు దేశంలో ఉన్న యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమని.. ఆదర్శం అని కొనియాడారు.
అదే రీతిలో రాజ్యసభలో కూడా పెద్దలు.. పీవీ సింధు సాధించిన పథకాన్ని బట్టి రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ప్రశంసల వర్షం కురిపించారు. ఇక ఇదే రీతిలో రాష్ట్రపతితో పాటు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ నాయకులు ముఖ్యమంత్రులు.. పీవీ సింధు సాధించిన ఘనత పట్ల సోషల్ మీడియా లో ఆనందం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా తెలుగు రాష్ట్రానికి చెందిన పివి సింధు అంతర్జాతీయ స్థాయిలో.. ఒలంపిక్ క్రీడ భాగంలో.. రికార్డులు సృష్టించడం తో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా కొనియాడుతున్నారు.