రెండు తెలుగు రాష్ట్రాలలో మిర్యాలగూడ ప్రణయ్ అమృత ల ఉదంతం ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. దళితుడైన ప్రణయ్ అగ్రకులానికి చెందిన అమృతాన్ని ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో ప్రణయ్ ని అతి దారుణంగా మారుతీ రావు కిరాయి గుండాలతో చంపేయడం జరిగింది. ఈ హత్య కేసులో జైలుకు వెళ్లిన మారుతీరావు బయటకు వచ్చిన తర్వాత కొంతకాలానికి ఓ ప్రైవేటు లాడ్జీలో ఆత్మహత్య చేసుకోవడం అమృత కుటుంబం లో కలకలం రేపింది. అప్పట్లో మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచిన ఈ ఉదంతంపై కన్నేసిన వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, అమృత… ప్రణయ్ లవ్ స్టోరీ ని సినిమాగా రూపొందించబోతున్నట్లు ‘మర్డర్’ అనే టైటిల్ ప్రకటించడం జరిగింది.
అదే రీతిలో ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. కాగా ఆర్జివి తీయబోతున్న ఈ సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ప్రణయ్ తండ్రి బాలస్వామి వర్మ సినిమా ఆపాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. వర్మ తీస్తున్న మర్డర్ సినిమా ప్రణయ్ హత్య ను ప్రేరేపించే లా ఉందని ఈ విషయంలో వర్మ పై చర్యలు తీసుకోవాలంటూ ఎస్సీ, ఎస్టీ కోర్టును ఆశ్రయించాడు. మరోపక్క రామ్ గోపాల్ వర్మ ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆరునూరైనా ‘మర్డర్’ సినిమా రిలీజ్ చేస్తానని చెప్పిన వర్మ ప్రణయ్ తండ్రి పిటిషన్ పై ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి.