Prashant Kishor : త్వరలో దేశంలో ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎన్నికల హడావిడి భారీ స్థాయిలో ఉంది. ఎక్కడికక్కడ ఆయా రాష్ట్రాలకు చెందిన పార్టీలు వ్యూహాలు ప్రతివ్యూహాలతో ప్రచారంలో పాల్గొంటున్నాయి. ఇలాంటి తరుణంలో బెంగాల్ రాష్ట్రంలో మమతా బెనర్జీ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న ప్రశాంత్ కిషోర్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బిజెపి పార్టీ అధికారంలోకి వస్తే తన జీవితంలో ఇంకా ఎప్పుడూ కూడా ఎన్నికల వ్యూహకర్తగా .. ఎవరికీ పని చేసే ప్రసక్తి ఉండదు అంటూ మానేస్తాను అని పేర్కొన్నారు. బెంగాల్ రాష్ట్రంలో వందకు పైగా బీజేపీకి సీట్లు వస్తే తాను.. ఇంకా పూర్తిగా ఎన్నికల వ్యూహకర్తగా ఎవరికి సూచనలు ఇవ్వను అని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అంచనాలు తప్పాయి, అప్పట్లో అందుకే ఓడిపోవడం జరిగింది. కానీ బెంగాల్ రాష్ట్రంలో అటువంటి పరిస్థితి ఉండదు అని స్పష్టం చేశారు. బెంగాల్ రాష్ట్రంలో పూర్తిగా స్వేచ్ఛ మమతా బెనర్జీ ఇవ్వటం జరిగిందని తెలిపారు. అందువల్ల కచ్చితంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ భారీ స్థాయిలో విజయం సాధిస్తుందని స్పష్టం చేశారు. బెంగాల్ రాష్ట్రంలో 200 స్థానాలు గెలుస్తుందని బీజేపీ పెద్దలు చేస్తున్న వ్యాఖ్యలు.. కేవలం అభద్రతా భావానికి గురి చేయటం కోసం అంత సీన్ బీజేపీకి లేదని తెలిపారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి బెంగాల్ రాష్ట్రంలో తిరుగు లేదని స్పష్టం చేశారు. పార్టీని గెలిపించడానికి కోసం తాను చేస్తున్న ఈ ప్రయత్నంలో కొంతమందికి నచ్చకపోవటం వల్ల వెళ్లిపోతున్నారని నేను పార్టీని గెలిపించడానికి మాత్రమే ..బెంగాల్ లో రాణి స్తున్నట్లు.., ఈ విధంగా తన వల్లే పార్టీ నుంచి నేతలు వెళ్లిపోతున్నారని వస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్ వేశారు ప్రశాంత్ కిషోర్.