ప్రస్తుతం థియేటర్లు తెరిచే పరిస్థితి లేదు. మరి కొంత కాలం ఈ పరిస్థితి ఇలానే ఉండనుంది. దీంతో సినీ నిర్మాతలు ప్రతామ్నాయ మార్గాలపై దృష్టి సారించారు. ఓటిటి విడుదల ప్రస్తుతానికి నిర్మాతలకు ఊరటగా నిలుస్తోంది. అయితే మిగతా భాషలతో పోల్చుకుంటే తెలుగు నిర్మాతలు ఇంకా ఓటిటి విడుదలపై వెనకడుగు వేస్తూనే ఉన్నారు.
అయితే నాని సినిమా వి తో పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. ఇప్పుడు మరో సినిమా ఓటిటి కోవలోకే వెళుతోంది. రాజ్ తరుణ్, మాళవిక నాయర్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ఒరేయ్ బుజ్జిగా. ఈ సినిమాను విజయ్ కుమార్ కొండా తెరకెక్కించాడు. మార్చ్ లోనే ఈ సినిమా విడుదల కావాల్సి ఉన్నా అది కుదర్లేదు. ఇప్పుడు నిర్మాతలు ఓటిటి సంస్థ ఆహాతో డీల్ సెట్ చేసుకున్నాయి. త్వరలోనే ఆహాలో ఒరేయ్ బుజ్జిగా విడుదల కానుంది.