చిత్రపరిశ్రమలో రాజమౌళి అంటే తెలియని వారుండరు. తెలుగు సినీ కథారచయిత కె. వి. విజయేంద్ర ప్రసాద్ కుమారుడు అయిన రాజమౌళి దర్శకుడు రాఘవేంద్ర రావు శిష్యుడిగా స్టూడెంట్ నెం.1 చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేసి ఆ తర్వాత వరుసగా ఎన్నో హిట్ చిత్రాలను టాలీవుడ్కు అందించారు. ఇక ఇప్పటి వరకూ ఒక్క పరాజయం కూడా చవిచూడకపోవడం రాజమౌళి ప్రత్యేకత. ఇలా ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలోని అగ్ర దర్శకుల్లో ఒకరిగా నిలిచారు. కాగా 2015, 2017 లో రాజమౌళి తీసిన బాహుబలి (ది బిగినింగ్), బాహుబలి (ది కన్ క్లూజన్) సినిమాలు ప్రభంజనం సృష్టించాయి. చిత్రపరిశ్రమలోని రికార్డ్లను తిరిగ రాశాయి. అయితే బాహుబలి చిత్రం తర్వాత రాజమౌళి నిర్మిస్తున్న మరో మూవీ ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమాని ప్రకటించినప్పటి నుండి ప్రేక్షకుల్లో గానీ, సినీ వర్గాల్లో కానీ భారీ అంచనాలు నెలకొన్నాయి.
అప్పటి నుండి ఈ సినిమా విషయంలో వచ్చే ప్రతి అప్డేట్ సంచలనానికి కేంద్రంగా మారుతుంది. ఎందుకంటే ఈ చిత్రాన్ని మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో తెరకెక్కించడమే దీనికి కారణం. ఇలా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ పీరియాడిక్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. చిత్రం విడుదల కోసం దేశ వ్యాప్తంగా ఎదురు చూస్తున్నారంటే ఈ మూవీ పైన ఎన్ని అంచనాలు ఏర్పడ్డాయో అర్ధం చేసుకోవచ్చూ. ఇక ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం విడుదలపై చర్చసాగుతుండగా జక్కన్న మాత్రం ఈ విషయంలో ఇప్పటికి క్లారీటి ఇవ్వలేదు.
కానీ అందరూ సమ్మర్ అంటే జూన్ లేదా జూలై లో ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ అవుతుందని భావిస్తున్నారు. కాని రాజమౌళి మాత్రం విజయదశమి పండుగ సందర్భంగా రిలీజ్ చేసేందుకు నవరాత్రుల్లో ఒక డేట్ ని రిలీజ్ కి లాక్ చేయాలని డిసైడయినట్టు సమాచారం. మరి రాజమౌళి ఈ చిత్రాన్ని అప్పటికే ఫిక్స్ చేసారా లేదా అన్న అఫీషియల్ న్యూస్ రావలసింది ఉంది. అప్పటి వరకు అభిమానులకు ఎదురు చూపులు తప్పవని అంటున్నారు. ఇక ఈ సినిమా కంప్లీట్ అయ్యాక చరణ్ కొరటాల శివ దర్శకత్వంలో ఒక పాన్ ఇండియన్ సినిమా చేస్తాడన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఆచార్య లో కీలక పాత్ర చేయబోతున్నాడు చరణ్. కాగా ఎన్.టి.ఆర్ .. తన నెక్స్ట్ మూవీని త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో చేయబోతున్నాడు. మార్చ్ నుంచి ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళబోతుందని సమాచారం.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!