రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహించిన 43వ ఏజీఎం సమావేశంలో గత కొద్ది కాలంలో వారి సంస్థ సాధించిన ఘనతలు మరియు రాబోయే రోజుల్లో వారి చేయనున్న ఆవిష్కరణలు, ప్రవేశపెట్టనున్న కొత్త పరికరాల గురించి మరియు సాఫ్ట్వేర్ డేవలెప్మెంత్ ఇంకా ఇంటర్నెట్ యాక్సెస్ గురించి ఆ సంస్థ అధినేత ముఖేశ్ అంబానీ ప్రస్తావించారు.
వీడియో కాలింగ్ యాప్ లో సరికొత్త అధ్యాయం అయినా ‘జియో మీట్’ ను అందరి ముందుకు తీసుకు రావడం తనకెంతో ఆనందంగా ఉందని ముఖేష్ అంబానీ తెలిపారు. అది విడుదల అయిన కొద్ది రోజుల్లోనే ఇప్పటికే యాభై లక్షల మంది దానిని డౌన్లోడ్ చేసుకున్నారు అని చెప్పిన ఆయన కేవలం జియో ప్లాట్ఫామ్ మీదనే కాకుండా ప్రతి చోట దానిని వీడియో కాన్ఫరెన్స్ గా ఉపయోగించవచ్చు అని తెలిపారు.
ఇదే సమావేశంలో రిలయన్స్ జియో సంస్థ కొత్తగా జియో గ్లాస్ను పరిచయం చేసింది. ఈ జియో గ్లాస్కి ఓ కేబుల్ ద్వారా మీ ఫోన్కు ఎటాచ్ చేయొచ్చు. తద్వారా ఇంటర్నెట్తో కనెక్ట్ కావొచ్చు. ఇది కేవలం 75 గ్రాముల బరువు ఉంటుంది. హై రిజల్యూషన్ డిస్ ప్లే ఉంటుంది. దీనికి పర్సనలైజ్డ్ ఆడియో కూడా ఉంటుంది. కొత్తగా ఆడియో డివైజ్లు అవసరం లేదు. అన్ని రకాల ఆడియో ఫార్మాట్లు దీంట్లో పనిచేస్తాయి. 25 అప్లికేషన్లకు సపోర్ట్ చేస్తుంది. హోలో గ్రాఫిక్ డిజైన్ ఉంటుంది. ఇక ఇది వీఆర్ వీడియోల సాఫ్ట్వేర్ కు పక్కాగా కంపాటిబల్.
ఇప్పటికే జియో ద్వారా అనేక సంచలనాలు సృష్టించిన రిలయెన్స్… కొత్తగా Jio TV+ ప్రకటించింది. ఓటీటీ ప్లాట్ఫామ్స్ అయిన నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, హాట్స్టార్ లాంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న 12 స్ట్రీమింగ్ యాప్స్ని ఒకే చోట అందించడం జియో టీవీ+ ప్రత్యేకత. వాయిస్ సెర్చ్ ద్వారా జియో టీవీ+ పనిచేస్తుంది. ప్రత్యేకంగా స్ట్రీమింగ్ యాప్ ఓపెన్ చేయకుండా వాయిస్ సెర్చ్ చేయొచ్చు. వేర్వేరు లాగిన్ ఐడీలు కూడా అవసరం లేదు. నేరుగా వాయిస్ సెర్చ్ ద్వారా వేర్వేరు ప్లాట్ఫామ్స్లోని కంటెంట్ సెర్చ్ చేయొచ్చు.
ఇకపోతే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఇండియాలోనే అతిపెద్ద రైట్స్ ఇష్యూ కలిగిన సంస్థగా ఆవిర్భవించిందని… 53,124 కోట్ల రూపాయల రైట్స్ ఇష్యూ కలిగిన ఈ సంస్థ భారతదేశ పెట్టుబడి మార్కెట్ లోనే 1.59 సార్లు ఓవర్-సబ్స్చ్రైబ్డ్ సంస్థగా అవతరించిన కొత్త రికార్డు నెలకొల్పింది అని చెప్పారు.
ఇకపోతే ప్రపంచంలోనే మేటి సంస్థల్లో ఒకటైన గూగుల్ రిలయన్స్ లో 33,737 కోట్ల పెట్టుబడి పెడుతోందని అంబానీ ప్రకటించారు. ఇది జియో ప్లాట్ఫామ్స్ లోని పెట్టుబడుల్లో 7.7 శాతం వాటా అని చెప్పారు. ఇక వచ్చే సంవత్సరానికి రిలయన్స్ జియో భారతదేశంలోనే తయారుచేయబడ్డ 100% నాణ్యతపూరితమైన 5G నెట్వర్క్ సొల్యూషన్ వస్తుందని…. ఇప్పుడు ట్రయల్స్ లో ఉన్న ‘5G స్పెక్ట్రమ్’ అందుబాటులోకి రాగానే వినియోగదారులకు కూడా అందుబాటులో ఉందని వివరించారు. ఇక డిజిటల్ కనెక్టివిటీ కి సంబంధించి మొబైల్ బ్రాడ్బ్యాండ్, జియో ఫైబర్, జియో ఎంటర్ప్రైజెస్ బ్రాడ్బ్యాండ్ మరియు జియో న్యారో బ్యాండ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ని తాము పూర్తిస్థాయిలో మొదలుపెట్టామని మరియు రానున్న మూడేళ్లలో జియో నెట్వర్క్ ని కనీసం యాభై కోట్ల మంది మొబైల్ కస్టమర్స్ ను వాడుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.