సుప్రీం కోర్టు తీర్పుతో తన స్థానంలో కూర్చున్న సిబిఐ డైరెక్టర్ అశోక్ వర్మకు మళ్లీ స్థాన చలనం కల్గింది. సివిసి నివేదికలో ఆయనపై ఉన్న ఆరోపణలను సెలెక్ట్ కమిటి నమర్ధించింది.
24 గంటల్లో రెండుసార్లు హై పవర్ కమిటీ సమావేశమైంది. అలోక్ వర్మను ఆ పదవి నుండి తప్పించి అగ్నిమాపక శాఖ డి జి గా బదిలీ చేయాలని హై పవర్ కమిటీ నిర్ణయించింది.
దాదాపు రెండు గంటలపాటు సాగిన ఈ సమావేశంలో ప్రధాని మోదీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏకే సిక్రీ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే పాల్గొన్నారు.
సి.బి.ఐ తాత్కాలిక డైరెక్టర్ గా మళ్లీ నాగేశ్వరరావు
కొత్త డైరెక్టర్ నియమించే వరకు తాత్కాలిక డైరెక్టర్ గా మన్నెం నాగేశ్వరరావును మళ్లీ నియమించారు. అలోక్ వర్మను సి.బి.ఐ డైరెక్టర్ పదవి నుండి తప్పించిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా సి.బి.ఐ కేంద్ర కార్యాలయం వద్ద పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు.