రవితేజ ప్రస్తుతం నటిస్తున్న క్రాక్ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగు వారికి పెద్ద పండుగైన సంక్రాంతి బరిలో ప్రతీ ఏడాది భారీ సినిమాలు బరిలో దిగుతాయి. అయితే ఈసారి అంత పోటీ ఉండదని భావిస్తున్నారు. కారణం కరోనా అని తెలిసిందే. 50 శాతం ఆక్యుపెన్సీ తో పెట్టిన బడ్జెట్ రాదన్న అనుమానంతో నిర్మాతలు చాలా సినిమాలు రిలీజ్ చేయకుండా పోస్ట్ పోన్ చేస్తున్నారు. చెప్పాలంటే ఈ విషయంలో దాదాపు మేకర్స్ అందరూ డైలమాలో ఉన్నారు. అయితే సాయి ధరం తేజ్.. రవితేజ మాత్రం పిచ్చ క్లారిటీగా ఉన్నారు. అందుకే తమ సినిమాల రిలీజ్ డేట్స్ ని ప్రకటించేశారు.
తాజాగా రవితేజ తను నటిస్తున్న క్రాక్ సినిమాని సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 న రిలీజ్ చేసేందుకు డేట్ లాక్ చేసినట్టు అధికారకంగా ప్రకటించాడు. కాగా నెక్స్ట్ సినిమా కూడా పట్టాలెక్కి షూటింగ్ జరుగుతోంది. రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఖిలాడి అన్న సినిమాలో రవితేజ నటిస్తున్న సంగతి తెలిసిందే. మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నట్టు సమాచారం. కాగా ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. క్రాక్ కి థమన్ సంగీతమందించిన సంగతి తెలిసిందే.
కానీ ఖిలాడి సినిమాకి మాత్రం రాక్ స్టార్ దేశ్రీప్రసాద్ సంగీతమందించబోతున్నాడు. ఇప్పటికే ఖిలాడి సినిమా కోసం అద్భుతమైన ట్యూన్స్ రెడీ చేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు ప్రస్తుతం టాలీవుడ్ లో కాస్త జోర్ తగ్గిన దేవీశ్రీప్రసాద్ మళ్ళీ తన సత్తా చాటేందుకు పుష్ప, ఖిలాడి, రంగ్ దే సినిమాలకి సూపర్ హిట్ అయ్యే ట్యూన్స్ ఇస్తున్నాడట. అంతేకాదు రవితేజ ఖిలాడి సినిమా మ్యూజికల్ గా భారీ హిట్ ఇస్తానని ప్రామిస్ చేశాడట దేవీశ్రీప్రసాద్. కాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమాకి దేవీశ్రీప్రసాద్ మ్యూజిక్ అందివ్వబోతున్నట్టున్నాడు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!