జీవితం ఎంతో విచిత్రమైంది. కోటీశ్వరుడిని ఉన్నట్టుండి బిచ్చగాన్ని చేస్తుంది. అదే కటిక పేదరికంలో ఉన్న వాన్ని కోటీశ్వరుడిని చేస్తుంది. అలా కావడానికి ఏండ్లు కూడా పట్టవు, కేవలం గంటల వ్యవధిలో అంతా మారిపోతుంది. ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. ఇలాంటి అరుదైన ఘటన మళ్లీ ఒకటి జరిగింది. కటిక పేదరికంలో ఉన్న వాడిని ఒక్కరోజులో కోటీశ్వరుడిని చేసింది. ఈ ఘనటను చూసిన వారు, చదివిన వారు అబ్బా.. నాకు ఇలా జరిగితే ఎంత బాగుండు అని అనుకుంటున్నారంటా.. అసలు విషయం ఏంటో తెలుసుకుందాం రండి..
లాటరీ తగిలి కోటీశ్వరుడు అయిన ఘటనలు చూసే ఉంటాం.. కానీ ఉల్కాపాతం వలన కోటీశ్వరుడు అయిన వారి గురించి విన్నారా..? అరే ఉల్కా పడితే చనిపోతం కానీ కోటీశ్వరుడు కావడం ఏంటని అనుకుంటున్నారా..? నిజమేనండి.. ఒక ఉల్కా రాత్రికి రాత్రే ఒక వ్యక్తిని కోటీశ్వరుడిని చేసింది. ఆకాశంలోనుంచి అతని ఇంటిమీద అక్షరాల రూ. 13 కోట్లు విలువచేసే ఒక స్పేస్ రాక్ పడింది. దీంతో అతని అదృష్టం పడింది.
వివరాల్లోకి పోతే.. జోసువా హుటగలుంగ్ అనే ఇండోనేషియా వ్యక్తి ఉత్తర సుమిత్రాలోని కోలాంగ్లో ఉంటున్నాడు. శవపేటికలను తయారు చేస్తూ.. బ్రతుకుతున్నాడు. ఇలా ఒక రోజు తన పనిలో ఉన్నప్పుడు ఇంటి మీద ఏదో పడినట్లు గట్టిగా శబ్దం వచ్చింది. ఇంటిమీదకు ఎవరైనా రాళ్లు విసురుతున్నారని అని బయటకు వచ్చి చూశాడు అతను. అప్పుడు అక్కడ ఒక నల్లని రాయి కనిపించింది. దాన్ని పట్టుకుని చూస్తే.. అతనికి వేడిగ అనిపించింది. అదేక్కడికెళ్లి పడిందో అతనికి అర్థం కాలేదు కొద్దిసేపు.
ఆ రాయే అతన్ని కోటీశ్వరుడిని చేస్తుందని మాత్రం అతను అనుకోకుంటాడు. అయితే ఈ విషయం మీద
జోసువా మాట్లాడుతూ ఇంటిమీడ పడిన ఆ రాక్ 15 సెంటీమీటర్లు భూమిలోకి చొచ్చుకుపోయిందని తెలిపాడు. ధాని బరువు అటూ ఇటూగా 2.1కిలోలు ఉండొచ్చిని తెలిపాడు. చివరకు అది ఆకాశం నుంచే పడిందని నిర్ధారించుకున్నాడు. ఆ ఉల్క చాలా విలువైందిగా గుర్తించాడు. దానికి 13 కోట్ల రూపాయలకు శాస్త్రవేత్తలు కొనుగోలు చేశారు.
ఈ ఉల్క క్వాలిటీని బట్టి దాని ధర నిర్ణయించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.ఇలాంటి వాటికి గ్రాముకు 1000 డాలర్లు కూడా చెల్లిస్తారని వారు తెలిపారు. అయితే జోసువాకు దొరికిన స్పేస్ రాయి 4.5 బిలియన్ ఏళ్ల నాటిదని శాస్త్రవేత్తలు గుర్తించారు.