విలక్షణమైన నటనతో తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు సత్య దేవ్. సినిమాలో ఒక క్యారెక్టర్ చేశాడంటే మరొక సినిమాలో ఆ క్యారెక్టర్ రిపీట్ కాకుండా చూసుకుంటున్నాడు. ఇంకా చెప్పాలంటే ఆయన చేసిన మూవీలో సత్య కనిపించడు.. ఆ పాత్ర మాత్రమే కనిపిస్తుంది. అందుకే అనతి కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు సత్యదేవ్. కరోనా లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.. థియేటర్లు మూతపడ్డాయి. కానీ ఓటీటీ వేదిక గా ఎన్నో సినిమాలు విడుదలయ్యాయి. సత్యదేవ్ నటించిన ఉమామహేశ్వర ఉగ్రరూపం కూడా రిలీజై మంచి హిట్ ను దక్కిన్చుకుంది.
ప్రస్తుతం మిల్కీబ్యూటీ తమన్నా తో కలిసి గుర్తుందా శీతాకాలం సినిమాలో నటిస్తున్నాడు సత్యదేవ్. కన్నడ మూవీ ” లవ్ మాక్ టైల్ ” కి ఈ మూవీ రీమేక్ గా తెరకెక్కుతోంది. సత్యదేవ్ – తమన్నాల తోపాటు మేఘ ఆకాష్, కావ్య శెట్టి ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటిదాకా బాగానే ఉన్నా ఈ సినిమాలో నటించిన మిల్కీ బ్యూటీ పై సత్యదేవ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాలో నా కంటే తమన్నా పాత్ర ఎక్కువగా ఉంటుంది అన్నాడు సత్యదేవ్. ఆమె ఈ సినిమాకి నిజమైన హీరో అని అన్నాడు. అలాగే లాక్ డౌన్ సమయంలో ఎన్నో కథలు విన్నాను అని.. కానీ ఈ కథ మాత్రం తనకు బాగా కనెక్ట్ అయింది అన్నాడు సత్యదేవ్.
అందుకే ఈ సినిమాకి ఓకే చెప్పానన్నాడు. ఒక హీరో అయ్యుండి తమన్నాను ఇలా అనడం అందరినీ షాక్ కి గురి చేసింది. ఇక తమన్నాతో నటించడం చాలా సంతోషంగా ఉందని కూడా తెలిపాడు. కాగా గుర్తుందా శీతాకాలం షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. రెండో షెడ్యూల్ ప్రారంభం అయ్యేసరికి తమన్నాకు కరోనా రావడంతో పెండింగ్లో పడింది. ప్రస్తుతం కరోనా నుంచి కోలుకున్న తమన్నా షూటింగ్ లో పాల్గొంటోంది. దీంతో సెకండ్ షెడ్యూల్ ని ప్రారంభించాలని మూవీ యూనిట్ రెడీ అయ్యారు. మరి ఈ మూవీలో సత్యదేవ్ ఎలాంటి క్యారెక్టర్ తో అలరించనున్నా డో తెరపైనే చూడాలి. ఇక తమన్నా అహా కోసం 11 త్ అవర్ అన్న వెబ్ సిరీస్ కూడా చేస్తోంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!