YS Sharmila: తెలుగు రాష్ట్రాలలో పాదయాత్ర చాలామంది రాజకీయ నాయకుల కెరియర్ ని పూర్తిగా మార్చేసిన సంగతి తెలిసిందే. వైయస్సార్ పాదయాత్ర అదే రీతిలో చంద్రబాబు చేసిన మీకోసం పాదయాత్ర వైయస్ జగన్ చేసిన ప్రజా సంకల్ప పాదయాత్ర వారి దిశ దశ లను పూర్తిగా మార్చేశాయి. వీళ్ళు పాదయాత్ర చేయకముందు ముందు వాళ్ల పార్టీల పరిస్థితి ఒకలా ఉంటే పాదయాత్ర చేపట్టిన తర్వాత.. అధికారంలోకి సదరు పార్టీలు రావటం మాత్రమేకాక ముఖ్యమంత్రులు అయ్యారు ఈ ముగ్గురు.
ఇటువంటి తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో వైయస్సార్ తెలంగాణ పార్టీ స్థాపించిన వైయస్ షర్మిల ఇప్పుడు ఇదే దిశగా తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేయడానికి..రెడీ అవుతోంది. అక్టోబర్ 18 వ తారీకు నుండి తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో పాదయాత్ర చేయడానికి రెడీ అవుతుంది. ఇప్పటికే రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆల్రెడీ షర్మిల గతంలో పాదయాత్ర చేయటం తెలిసిందే.
ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా షర్మిల పాదయాత్ర చేయడానికి రెడీ అయినట్లు… పార్టీని బలోపేతం చేయడం కోసం.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాల నుండి అందుతున్న సమాచారం. ప్రస్తుతం కేవలం నిరుద్యోగ సమస్య మాత్రమే పోరాటం చేస్తున్న.. కానీ పార్టీలో సరిగ్గా చేరికలు లేకపోవడంతో.. ఇంకా సైలెంట్ గా ఉంటే లాభం లేదని.. గట్టిగా ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత తీసుకురావడానికి.. పార్టీని బలోపేతం చేయడానికి వైయస్ షర్మిల పాదయాత్ర తెలంగాణలో నిర్వహించాలని డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.