దేశంలో రోజు రోజుకి ట్రాఫిక్ ఉల్లంఘనలు ఎక్కువైపోతున్నాయి.. పోలీసులు తనిఖీలు చేయడం మరింత విస్తృతం చేశారు.. అయినా ట్రాఫిక్ పోలీసుల కళ్లుకప్పి అక్రమ రవాణా చేస్తుంటారు.. ఘరానా దొంగలను పట్టుకోవడం కోసం ట్రాఫిక్ పోలీసులు రేస్కు ఆపరేషన్స్ చేస్తున్నారు.. ట్రాఫిక్ పోలీసులు ఒక్కసారి నిఘా పెడితే ఎంత పెద్ద దొంగలముఠా అయినా చిక్కావలిసిందే.. ఈ నేపథ్యంలో బీహార్ పోలీసులు 4 గంటల పాటు తనిఖీలు చేశారు.. పూర్తి వివరాలు ఇలా..
తాజా సమాచారం ప్రకారం బీహార్ పోలీసులు తనిఖీ చేస్తున్న సమయంలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 60 మంది నేరస్థులను అరెస్టు చేసి దొంగలించిన వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కేవలం నాలుగు గంటలకు పైగా కొనసాగిన ఈ ఆపరేషన్లో పోలీసులు పెద్ద సంఖ్యలో వాహనాలను స్వాధీనం చేసుకొని నిందితులను పట్టుకున్నారు అనే ప్రశ్న కూడా తలెత్తింది ప్రజలు పోలీసులు చేసిన ఈ చర్యను కూడా ప్రశ్నించారు దీనికి సంబంధించిన సమాచారాన్ని ఇంకా అక్రమ రవాణా మద్యం బాటిల్స్ 3750 , 159 కిలోల మద్యం, రూ. 92000 నగదు కూడా పట్టుకున్నారు. బీహార్లోని 38 జిల్లాల్లో జరిగిన తనిఖీలలో ఇవి కనుగొన్నట్లు ఓ నివేదిక తెలిపింది.
చిక్కుకున్న నేరస్తులు వాహనాల నెంబర్స్ ట్రాక్ చేస్తే దేశవ్యాప్త నెట్వర్క్ వలె ఇది కనిపిస్తుంది. బీహార్ పోలీసులు చేసిన ఈ ఆపరేషన్ క్రిమినల్ కేసులో చిక్కుకున్న వారిలో భయాందోళనలు సృష్టించింది. ఇటీవల కాలంలో ఇలాంటివి చాలా ఎక్కువగా జరుగుతున్నాయి వీటిని నివారించడానికి పోలీసులు అనేక చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో కూడా ఈ తరహా ఆపరేషన్ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కార్ల యజమానులు దొంగల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొత్త టెక్నాలజీలు ఉపయోగించి ఆటోమొబైల్స్ కంపెనీలు కార్లను తయారు చేస్తున్నాయి. దొంగిలించిన వాహనాలను ఒక రాష్ట్రంలోవి మరో రాష్ట్రంలో అమ్మడం పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దొంగతనాలను నివారించడానికి వీలైనంత కొత్త టెక్నాలజీ ఉపయోగించాలి. కొత్త టెక్నాలజీలు ఉపయోగించినట్లైతే దొంగలించిన వాహనాలను సులభంగా గుర్తించడానికి అవకాశం ఉంటుంది.