సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక జనాలలో చాలా చైతన్యం నెలకొంది. దాగి ఉన్న ప్రతి విషయం డీటెయిల్ గా ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఉద్దేశాలు సోషల్ మీడియా వేదికగా బయటపడుతూ వచ్చాయి. ఒక పాలసీ పరంగా పనిచేసే మీడియా సంస్థల పని చాలా వరకు ఫేస్బుక్ ట్విటర్ వంటివి వచ్చిన తర్వాత వాటి ఆటలు సాగడం లేదు.
ఒక పార్టీకి కొమ్ము కాసే ఒక సంస్థకు భజన చేసే మీడియా సంస్థలు చాలా వరకు సోషల్ మీడియా సామాన్యుడికి అందుబాటులోకి వచ్చాక ఏ మాత్రం ప్రభావితం చేయలేక పోతున్నాయి. ఇటువంటి తరుణంలో ఫేస్బుక్ బావ స్వేచ్ఛ ప్రకటన హక్కులను హరించి వేసే విధంగా తాజాగా తయారవడం ఇప్పుడు సంచలనంగా మారింది. యూజర్ ఎలాంటి పోస్ట్ పెట్టాలో, ఎటువంటివి పెట్టకూడదో డిసైడ్ చేస్తున్నాయి. దీంతో నెటిజన్ల నుండి విమర్శలు వస్తున్నాయి.
ఎవరి భావాలు వారివి వ్యక్తపరచు కోవచ్చు, ఉద్రేకాలు రెచ్చగొట్టే విధంగా ఇటువంటి కండిషన్లు పెడితే తప్పు లేదు మామూలుగా పెట్టడం దారుణమని అంటున్నారు. బావ స్వేచ్ఛ ప్రకటన లకి వారధిగా పేరొందిన ఫేస్ బుక్ ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం సరైంది కాదని అంటున్నారు. ఫాక్ట్ చెక్ టీం పేరిట సొంత ఐడియా లాజికల్ ఉన్నవారిని పెట్టడం.. వాళ్లంతా తమ ఐడియాలజీకి విరుద్ధంగా పోస్టులు పెట్టే వారిని బ్లాక్ చేయడం దానికి ఫేస్బుక్ యాజమాన్యం సపోర్ట్ చేయడం వల్ల ఉన్న నిజం చెప్పే ప్లాట్ ఫాం కూడా పోగుడుతున్నారని అంటున్నారు. చైనా ఇండియా భూభాగాన్ని ఆక్రమించినట్లు అంటే దాన్ని డిసైడ్ చేయాల్సింది ఎవరు..?… ఇలాంటి విషయాలలో ఫేస్ బుక్ మధ్యలో వచ్చి.. అది ఫేక్ అనే రీతిలో తమకు అనుగుణంగా పాలసీలు ఉండె వారిని సపోర్ట్ చేస్తూ ఫాక్ట్ చెక్ టీం పెట్టడం ఉన్న బావ స్వేచ్ఛ హక్కులు ప్లాట్ ఫాం ని ఫేస్ బుక్ కాల రాస్తోంది అని నెటిజన్లు గగ్గోలు పెడుతున్నారు. ఏకంగా ఇప్పుడు అమెరికా రాజకీయాలలో కూడా ఈ ఫాక్ట్ చెక్ టీం అధ్యక్ష ఎన్నిక విషయంలో జరుగుతున్న అవకతవకలు గురించి ట్రంప్ కి వ్యతిరేకంగా నడుస్తోంది అని, ఈ విషయంలో ఇప్పటికే అమెరికా ప్రభుత్వం నుండి నోటీసులు కూడా అందుకోవడం జరిగింది. ఈ విధమైన ఉద్దేశాలతో ఫాక్ట్ చెక్ టీం పెట్టుకున్న ఫేస్ బుక్ రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి ఉద్యమాలు ప్రజలలో లేవనెత్తుతుందో అని పరిశీలకులు అంటున్నారు. ఇటువంటి పరిణామాలు ఏమాత్రం మంచిది కాదని ప్రపంచవ్యాప్తంగా ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే విధంగా పరిస్థితులు రాబోయే రోజుల్లో మారే అవకాశం ఉందని చెప్పుకొస్తున్నారు.