కుర్చేల్లో కూర్చుని ఎన్ని లెక్కలైనా వేయొచ్చు.., ఎన్ని మాటలైనా చెప్పొచ్చు.., ఎన్ని లాజిక్కులైనా లాగొచ్చు.., కానీ క్షేత్రంలోకి వెళ్తేనే అసలు విషయం తేలేది. అసలు రంగు బయటపడేది. తిరుపతి ఉప ఎన్నికపై టీడీపీలో ప్రస్తుతం అదే జరుగుతుంది. చంద్రబాబు వేస్తున్న లెక్కలు చూసి, టీడీపీలో శ్రేణులకు తిక్కతిక్క లేచేటట్టు ఉందట..!! అదేమిటో చూద్దాం పదండి..!!
బాబోరి లెక్కలు ఇలా ఉన్నాయి..!!
“2019 లో వైసీపీ కీ, టీడీపీ కి కేవలం 10 శాతం మాత్రమే ఓట్లు తేడా ఉంది. సో.., ఈ పదిలో సగం మనం లాగేస్తే అంటే 5 శాతం ఓట్లు లాగేస్తే.. టీడీపీకి, వైసిపికి సమం అయిపోతాయి. మనం గెలిచేయొచ్చు. టీడీపీ కార్యకర్తలు అందరూ ఆ పనిలో ఉండాలి. గ్రామాల్లో ఓట్లు లాగే పనిలో ఉండాలి” అంటూ బాబు గారు నిన్న జరిగిన టెలి కాన్ఫరెన్స్ లో సెలవిచ్చారు. ఇది విన్న టీడీపీ శ్రేణులు నవ్వాలో, ఏడవాలో తెలియక బిక్కమొహాలు వేసుకుని తిరుపతిలో తిక్కతిక్కగా మాట్లాడుకుంటున్నారట.
వాస్తవాలు ఇలా ఉన్నాయిగా..!!
తిరుపతి ఎంపీ స్థానం పరిధిలో చూసుకుంటే టీడీపీకి, వైసిపికి రెండున్నర లక్షల ఓట్లు తేడా ఉంది. 2019 ఎన్నికల్లో వైసీపీ అంత భారీ మెజారిటీతో గెలిచింది.అక్కడ ఇప్పుడు టీడీపీ గెలవాలి అంటే నాడు వచ్చిన ఓట్లు ఒక్కటి కూడా పోగొట్టుకొకూడదు.., అండ్ నాడు వైసిపికి పడిన కనీసం 1 . 30 లక్షల ఓట్లు లాక్కోవాలి. టీడీపీ ఒక్కటి కూడా పోగొట్టుకొకూడదు, వైసీపీ మాత్రం లక్షల ముప్పై వేల ఓట్లు పోగొట్టుకోవాలట. ఇదే లాజిక్కు బాబు గారు చెప్పారు. దీన్ని ఆయన లక్షల్లో చెప్తే ఎక్కువలా ఉంటుంది కాబట్టి.., సింపుల్ గా సంతల్లో 5 శాతం అని తేల్చేశారు.
* తిరుపతి పార్లమెంటు పరిధిలో అన్ని అసెంబ్లీలో వైసీపీ చేతిలో ఉన్నాయి. వారే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. గూడూరు, సత్యవేడు, సూళ్లూరుపేట వంటి స్థానాల్లో వైసీపీ అత్యంత బలంగా ఉంది. ఈ నియోజకవర్గాల్లో ఎలా లాక్కోవాలి..?
* అధికారంలో ఉన్న పార్టీకి ఎమ్మెల్యేల బలం, కార్యకర్తల బలం, బలగం గట్టిగా ఉంటుంది. పోలీసులు, అధికారులు ఎంతోకొంత అధికార పార్టీకి అనుకూలంగా ఉంటారు. మరి .. అంత బలం నుండి ఈ లక్షకుపైగా ఓట్లు ఎలా లాక్కోవాలి..?
* టీడీపీ గెలిస్తే ఆ ముగ్గురికి మరో నాలుగో వ్యకి అవుతారు. ఆ ముగ్గురు సాధించింది ఏమి లేదు. వైసీపీ గెలిస్తే ఆ 20 మందికి మరొకరు యాడ్ అవుతారు. అంటే ఏమైనా చేయాలన్న ఎంతో కొంత సాధ్యమే అనే ఆలోచన సాధారణంగానే ఓటర్లలో ఉంటుంది. మరి ఈ ఆలోచనని పోగొట్టి.., లక్షకు పైగా ఓట్లు ఎలా లాక్కోవాలి..?
* ఇలా ఇన్ని లాజిక్కులు, క్షేత్రస్థాయి వాస్తవాలు వదిలేసి.. సింపుల్ గా బాబోరి 5 శాతం లెక్కలను వింటుంటే ఆ శ్రేణులకు, టీడీపీ పరిధిలోని టీడీపీ నేతలకు తిక్క లేస్తుందట..! పాపం.., బాబోరు.. తన లెక్కలతో, సొంత పార్టీ వాళ్లనే ఇలా తిక్క తెప్పిస్తున్నారన్నమాట..!!