NewsOrbit
న్యూస్

దారుణం.. చేత‌బ‌డి చేశాడంటూ ‘సాఫ్ట్ వేర్ ఇంజినీర్’ను ఏం చేశారో తెలిస్తే క‌న్నీళ్లు ఆగ‌వు!

మ‌నం ఏ యుగంలో ఉన్నామో ఇంకా చాలా మందికి తెలిసి రావ‌డం లేదు. ఆకాశంలోకి రాకెట్లు పంపిస్తూ.. రానున్న కాలంలో ఏం జ‌ర‌గ‌నుందో సైన్స్ సాయంతో చెప్తున్న ఈ రోజుల్లో.. ఇంకా చేతి గీత‌లు, మంత్రాలు చింత‌కాయలు అంటూ చాలా మంది మూఢ‌న‌మ్మ‌కాల ఉచ్చులో చిక్కుకుని ఉన్నారు. వాళ్లు తీరు మార‌దు.. అలాగే ఉంటారు అని ఊరుకుంటే.. అమాయకుల ప్రాణాలు తీస్తూ.. ఎన్నో దారుణాల‌కు ఒడి క‌డుతున్నారు.

దీనిపై ఎంత మంది ఎన్ని చెప్పినా మేము మార‌మ‌ని మొండికేస్తూ.. కూర్చుంటున్నారు. వాళ్ల‌ను మార్చాలంటే ముందు వాళ్ల మాన‌సిక స్థితిని మార్చాల‌ని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు ఇప్పుడు మ‌ళ్లీ జ‌రిగి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఒక ద‌గ్గ‌ర చేత‌బ‌డి చేయించాడ‌నే అనుమానంతో ఒక సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్ ను స‌జీవ ద‌హ‌నం చేస్తే.. ఇంకో చోట రైతును అత్య చేశారు. ఈ రెండింటికి కార‌ణాలు ఒక‌టే.. చేత‌బ‌డి అనే మూఢ‌న‌మ్మ‌కం.

జగిత్యాల జిల్లాలోని బల్వంతాపూర్‌ శివారులో హైదరాబాద్ కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు రాచర్ల పవన్‌కుమార్‌(38)ను అత‌ని బంధువులు సోమవారం రాత్రి సజీవ దహనం చేశారు. జగిత్యాలకు చెందిన విజయ్ త‌మ్ముడు జ‌గ‌న్ 12 రోజుల క్రితం అనారోగ్యంతో చ‌నిపోయాడు. దాంతో విజయ్‌ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు బావ‌ పవన్‌కుమార్‌, భార్య కృష్ణవేణితో కలిసి సోమవారం సాయంత్రం జ‌గిత్యాల‌కు వ‌చ్చారు.

పవన్‌కుమార్ కావాల‌ని త‌న భ‌ర్త‌ను ‌ చేతబడి చేయించి చంపించాడనే అనుమానంతో అక్కడే ఉన్న జగన్‌ భార్య సుమలత ప‌వ‌న్ కుమార్ ను ఒక గదిలో బంధించింది. అపై ఒంటిపై పెట్రోలు పోసి నిప్పు పెట్టింది. దీంతో ప‌వ‌న్ కుమార్ భార్య కృష్ణవేణి పోలీసులకు ఫిర్యాదు చేసింద‌. రంగంలోనికి దిగిన పోలీసులు ఆ గ‌దిని తెరిచి చూసేస‌రికి పవ‌న్ కుమార్ అప్ప‌టికే పూర్తిగా కాలిపోయాడు. విష‌యం తెలుసుకున్న జగిత్యాల డీఎస్పీ వెంకటరమణ ఘ‌ట‌నా స్థలాన్ని పరిశీలించారు. ఈ దారుణానికి కార‌కులైన ఇద్దర్ని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

ఇక కుమ్రం భీం జిల్లా తాటిమాదరానికి చెందిన రైతు ఆత్రం లచ్చు(40)కు పుర్కగూడ ద‌గ్గ‌ర్లో కొంత‌ పొలం ఉంది. ఆదివారం రాత్రి పంట‌ కాపలా కోసం వెళ్లిన అత‌ను సోమ‌వారం ఉద‌యం వ‌ర‌కు ఇంటికి రాలేదు. పొలానికి వెళ్లి చూస్తే.. రక్తపుమడుగులో చ‌నిపోయి ఉన్నాడ‌ని స్థానికులు తెలిపారు. అదే గ్రామానికి చెందిన ఆత్రం అర్జు(56) కొన్ని రోజుల ముందు చ‌నిపోయాడు. దీన‌కి కార‌ణం లచ్చు కుటుంబం మంత్రాలు వేయ‌డం వ‌ల‌నే అని ఆ కుటుంబ స‌భ్య‌లు ఆరోపించారు. ఈ నేప‌థ్యంలో ఇరు వ‌ర్గాల మ‌ధ్య గొడ‌వ‌లు జ‌రిగాయి. అర్జు బంధువులే లచ్చును చంపేశార‌ని అత‌ని భార్య మైనుబాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N