సోనూ సూద్ సినిమాల్లో భయంకరమైన విలన్ పాత్రలు పోషిస్తూ నిజమైన విలనిజాన్ని పండించాడు. సోనూసూద్ ను అందరూ నిజజీవితంలో కూడా కొంచెం విలన్ లాగానే చూసే వారు అయితే కరోనా సంక్షోభం తర్వాత పరిస్థితి మారిపోయింది ఇప్పుడు సోనూసూద్ ఒక నేషనల్ ఐకాన్. ‘బ్రదర్ ఆఫ్ ది నేషన్’ అనే బిరుదును ఇచ్చేశారు.
భారత దేశంలో ఉండే వందలాది సెలబ్రిటీలలో ఎవరికీ అంతటి గౌరవం దక్కలేదు. మరి జనాలు సోనుసూద్ పైన ఇంత ప్రేమ కురిపిస్తుంటే… సినిమా వారు మాత్రం కొంచెం జంకుతున్నారు. సోనుసూద్ లాక్ డౌన్ సంక్షోభ కాలంలో చేసిన సేవ ఇంకా చేస్తున్న సహాయ కార్యక్రమాలతో ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశాడు. ఇప్పుడు ఎన్నో కుటుంబాలకు సోనుసూద్ దైవం లాంటి వాడు. ఇక అటువంటి హీరోయినక్ పర్సనాలిటీ వచ్చేసిన సోనుసూద్ మునుపటిలాగా హీరో చేతిలో దెబ్బలు తిbe పాత్రల్లో చూసి జనాలు ఒప్పుకోగలరా అని నిర్మాతలు కాస్త ఆలోచిస్తున్నారట
ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టుల్లో కొన్ని భారీ మార్పులు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అల్లుడు అదుర్స్ సినిమాలో సోనుసూద్ వల్ల చాలా స్క్రిప్ట్ ను మార్చే చేశారట. అతని కున్న క్రేజ్ కు పాటలు కూడా యాడ్ చేశారని అంటున్నారు. ఇక బెల్లంకొండ శ్రీనివాస్ పాత్రను కూడా అతని కోసం కొద్దిగా మార్చినట్లు చెబుతున్నారు. సోనూ కూడా ఇకపై తాను విలన్ వేషాలు చేసే ప్రసక్తి లేదని చెప్పాడు. మంచి సపోర్ట్, పాజిటివ్ రోల్స్ చేస్తాను అని కూడా వెల్లడించాడు. అంతేకాకుండా ఏడాదికి వీలైనన్ని సినిమాలు చేయాలని ఫిక్స్ అయినట్లు తెలిపాడు.