Spekar Pocharam: దేశ వ్యాప్తంగా కరోనా థర్డ్ వేవ్ కొనసాగుతోంది. సామాన్యులు మొదలు కొని అనేక మంది ప్రముఖులు, సెలబ్రిటీలు, ప్రజా ప్రతినిధులు కోరనా బారిన పడుతున్నారు. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకుని జాగ్రత్తలు పాటిస్తున్న వారు సైతం కరోనా బారిన పడుతున్నారు. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ లో కరోనా బారిన పడి చికిత్స పొంది కోలుకున్న వారు మరో సారి కరోనా బారిన పడటం వారిలో ఆందోళన కల్గిస్తోంది. తాజాగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి మరో సారి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.
Spekar Pocharam: స్పీకర్ పోచారంకి మరో సారి
ఇటీవలే ఆయనకు కరోనా సోకడంతో ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్నారు. ఇప్పుడు మరో సారి కరోనా సోకింది. నిన్న ఆయనకు స్వల్ప లక్షణాలు కనబడటంతో పరీక్ష చేయించుకోగా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అయితే ఆయన వైద్యుల సూచనల మేరకు గచ్చిబౌలిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తన ఆరోగ్యం గురించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించిన పోచారం.. ఇటీవల కాలంలో తనను కలిసిన వారు అందరూ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
కాగా తెలంగాణ రోజు వారి కొత్త కేసులు 1500 లకు పైగా నమోదు అవుతున్నాయి. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వం సూచిస్తోంది.