కృష్ణా యూనివర్శిటీలో నెలకొన్న సమస్యలపై విద్యార్థులు, అధ్యాపకులు బుధవారం నిరసన వ్యక్తం చేశారు. సమస్యలపై రిజిస్టార్ను ఘోరావ్ చేశారు. యూనివర్శిటీలో మూడు రోజులుగా తాగునీరు సరఫరా కాక ఇబ్బందులు పడుతున్నారు. తాగునీరు సరఫరా చేసే కాంట్రాక్టర్కు రూ. 88వేల బకాయిలను యూనివర్శిటీ చెల్లించకపోవడంతో నీటి సరఫరా నిలిపివేశారు. దీంతో మంచినీళ్లు లేక విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో యూనివర్శిటీ అధికారుల జనరేటర్ ద్వారా విద్యుత్ సరఫరా చేస్తున్నారు. దీంతో ఈ పది రోజుల్లో డీజిల్ ఖర్చుల నిమిత్తం లక్షా 50వేల వరకూ అధికారులు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.
నెల రోజులుగా యూనివర్శిటీల పారిశుద్ధ్య పనులు కూడా నిలిచిపోయాయి. 16వ తేదీ వచ్చినా నవంబర్ నెల జీతాలు అధ్యాపకులకు అందలేదు. ఈ సమస్యలపై బుధవారం అధ్యాపకులు, విద్యార్థులు రిజిస్టార్ను ఘోరావ్ చేశారు. ఈ నేపథ్యంలో సమస్యలను పరిష్కరిస్తామని వీసీ హామీ ఇచ్చారు.