Breaking: హుస్సేన్ సాగర్ లో గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేసుకోవచ్చని తాజాగా సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం జరిగింది. గతంలో హుసేన్ సాగర్ లో . గణేష్ విగ్రహాల నిమజ్జనం పై.. హైకోర్టులో పిటిషన్ వేసిన టైంలో.. న్యాయస్థానం తెలంగాణ ప్రభుత్వానికి అదేరీతిలో జీహెచ్ఎంసీకి హుస్సేన్ సాగర్ లో.. గణేష్ నిమజ్జనాలు చేయొద్దని ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
అయితే గతంలో వినాయకచవితి సందర్భంలో ఈ ఆదేశాలను ప్రభుత్వం అదే రీతిలో జిహెచ్ఎంసి సీరియస్ గా తీసుకోకపోవడంతో ఈసారి హైకోర్టు ఈ విషయంపై సీరియస్ అయింది. ఎట్టి పరిస్థితుల్లో నిమజ్జనాలు హుస్సేన్ సాగర్ లో జరగకూడదని కోర్టు సూచించడంతో తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లడంతో.. గణేష్ నిమజ్జనాలు హుస్సేన్ సాగర్ లో చేసుకోవచ్చు అంటూ తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది.