Breaking: సైదాబాద్ చిన్నారి నీ అత్యాచారం చేసిన నిందితుడు రాజు మృతదేహం ఘట్ కేసరి రైల్వే ట్రాక్ వద్ద లభ్యమైన సంగతి తెలిసిందే. రాజు చెయ్యి పై మౌనిక అనే టాటూ ఉండటంతో.. అది రాజు మృతదేహాన్ని పోలీసులు గుర్తించి రాజు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.
పరిస్థితి ఇలా ఉంటే రాజు ది ఆత్మహత్య కాదు ఎన్కౌంటర్ కాదనీ.. సైదాబాద్ బాధిత కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ కళ్ళతో నిందితుడి మృతదేహాన్ని చూసిన తర్వాతే నమ్ముతాం అని అంటున్నారు. అంతేకాకుండా రాజు డెడ్ బాడీ ని సైదాబాద్ కి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. మృతదేహాన్ని సైదాబాద్ కి తీసుకు వచ్చే వరకు.. అత్యాచార నిందితుడు రాజు మృతిని మేము నమ్మం అని బాధిత కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు.