తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన “మాస్టర్” సినిమా మరి కొద్ది రోజుల్లో విడుదల కావడానికి రెడీ గా ఉంది. లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కడం తో సినిమాపై అంచనాలు ఓ రేంజిలో ఉన్నాయి. ఇదిలావుంటే ఇటీవల తమిళనాడు ప్రభుత్వం 100% ఆక్యుపెన్సీ తో థియేటర్ లు ఓపెన్ చేసుకోవచ్చని ప్రకటన ఇవ్వటంతో విజయ్ మాస్టర్ సినిమా వెంటనే రిలీజ్ చేయాలని సినిమా యూనిట్ అనుకున్న సమయంలో మోడీ సర్కార్ సరికొత్త షాక్ ఇచ్చింది.
మేటర్ లోకి వెళ్తే 100% ఆక్యుపెన్సీ ఇస్తూ తమిళనాడు ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను తప్పుబట్టింది కేంద్ర హోంశాఖ. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో చెల్లదని తేల్చిచెప్పింది. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో విజయ్ నటించిన “మాస్టర్” సినిమా 50% ఆక్యుపెన్సీ తో రిలీజ్ కానుంది. ఇటీవలే విజయ్ తమిళనాడు సీఎం పళని స్వామి ని కలిసి 100% ఆక్యుపెన్సీ ఇవ్వాలని కోరడం జరిగింది.
ఈ క్రమంలో తమిళనాడు ప్రభుత్వం విజయ్ అభ్యర్థన మేరకు అనుకూలంగా ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. ఇంతలోనే మోడీ సర్కార్ తమిళనాడు ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను కొట్టిపారేస్తూ కరోనా మహమ్మారి ప్రభావం రాష్ట్రంలో ఎక్కువగా ఉందని 50% ఆక్యుపెన్సీతో మాత్రమే థియేటర్లు ఓపెన్ చేయాలని తెలపడంతో విజయ అభిమానులు కేంద్రం తీసుకున్న నిర్ణయంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.