కారణాలు పూర్తిగా తెలియదు కానీ.. ఇంతకాలం వైఎస్ జగన్ ని విజయసాయి రెడ్డిని మాత్రమే టార్గెట్ చేస్తూ వచ్చిన టీడీపీ నేతలు గత కొన్ని రోజులుగా వైఎస్ భారతిని కూడా ఇన్వ్ వాల్వ్ చేస్తూ ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో నిన్న 108 స్కాం అంటూ మొదలుపెట్టిన టిడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తాజాగా సరస్వతి ఇండస్ట్రీస్ పేరుచెప్పి భారతిని లాగుతున్నారు!
జూలై 2008లో న జరిగిన సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ కు సంబంధించి జనరల్ బాడీ మీటింగ్ లో సిమెంట్ ఇండస్ట్రీస్ కూడా నిర్వహించేకునే విధంగా బైలాస్ లో సవరణ తీసుకొచ్చారని.. కానీ అంతకముందుగా అంటే జూన్ 2008 న మైన్స్ అండ్ జియాలజీ నుంచి వచ్చిన మెమో ఆధారంగా సరస్వతి పవర్స్ ఇండస్ట్రీస్ కు గనులు కేటాయించినట్లు జీవో నెం.107 లో పేర్కొన్నారని.. అంటే కంపెనీ బైలాస్ లో సిమెంట్ కంపెనీ ప్రస్తావణ రాకముందే.. సిమెంట్ కంపెనీకి భూకేటాయింపులకు సంబంధించిన ఫైల్ మూవ్ చేశారని చెబుతున్నారు పట్టాభి!
గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కంపెనీ బైలాస్ సవరించకుండానే.. భూకేటాయింపులకు సంబంధించి మెమోను మూవ్ చేసుకున్నారని పట్టాభి ఆరోపిస్తున్నారు. దీనికీ భారతికీ ఏమిటి సంబందం అనే ప్రశ్నకు… సరస్వతి ఇండస్ట్రీస్ లో వాటాలు ఉన్నాయని సాక్షాత్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే 2019 ఎలక్షన్ అఫిడవిట్ లో పేర్కొన్నారని.. ఆయన సతీమణి శ్రీమతి వైఎస్ భారతిరెడ్డి గారికి కూడా భాగస్వామ్యం ఉన్నట్లు అనెక్జర్-2 లో తెలిపారని పట్టాభి చెబుతున్నారు.
ఇదే క్రమంలో సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ కి రోజుకు 2,855 ఎం.క్యూబ్ నీటిని మాత్రమే వినియోగించాలని కేంద్ర పర్యావరణ శాఖ కండిషన్స్ ను విధించింది. రోజుకు 2,855 ఎం.క్యూబ్ నీరు అంటే ఏడాదికి 0.0368 టీఎంసీల నీరు అవుతుంది. పర్యావరణ అనుమతుల కాలపరిమితి ముగియడటంతో.. రెన్యువల్ కు ఫిబ్రవరి 2019న మరలా అప్లై చేశారు. అందులో రాష్ట్రంలో నూతన రాజధాని నిర్మాణం జరుగుతోందని.. అందుకు సిమెంట్ అవసరం ఉంది కనుక సిమెంట్ కంపెనీకి పర్యావరణ అనుమతులు ఇవ్వమని కోరారు. మీ కంపెనీ పర్మిషన్స్ కోసం రాజధాని గూర్చి చాలా గొప్పగా పొగిడారా అని పట్టాభి ప్రశ్నిస్తున్నారు.