హైదరాబాద్: ఆన్లైన్లో సినిమా టికెట్ల విక్రయించే విధానానికి స్వస్తి చెప్పాలన్న ఆలోచన చేస్తున్నట్లు సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సినిమా టికెట్ల విక్రయాల విషయంలో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకునే ఆలోచన చేస్తున్నది. ప్రభుత్వమే టికెట్ల అమ్మే ఆలోచన చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. ప్రభుత్వమే టికెట్లు అమ్మడం వల్ల అందరికీ లాభదాయకంగా ఉంటుందని తలసాని అన్నారు. ఇటు సినీ ప్రేక్షకులకు ప్రభుత్వ నిర్దేశించిన ధరలకే టికెట్లు లభించడంతో పాటు అటు నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు ప్రయోజకరంగా ఉంటుందని తలసాని తెలిపారు.
ప్రైవేటు యాజమాన్యాల ఆధ్వర్యంలో నడిచే సినీ ధియేటర్లలో ప్రభుత్వ ఆధ్వర్యంలో సినిమా టికెట్ల సాధ్యమవుతుందా అన్నది అనుమానమే. మంత్రి తలసాని ప్రతిపాదనపై సినీ యాజమాన్యం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.