గత సంవత్సరం ఫిబ్రవరి 14 వ తేదీన పుల్వామా దాడిలో 40 మందికి పైగా సిఆర్పిఎఫ్ జవాన్లను ఉగ్రవాదులు దొంగ దెబ్బ తీసి మట్టుబెట్టిన విషయం తెలిసిందే. ఒక సీఆర్పీఎఫ్ వాహనాన్ని వారు పేల్చివేయగా అక్కడికక్కడే వాహనంలోని వారందరూ మృతి చెందారు.
అయితే అదే అందుకు సంబంధించి భారత సైనికులు మళ్లీ ప్రతీకారం తీర్చుకున్నారు అనుకోండి అది వేరే విషయం. ఇక అప్పటినుంచి పాకిస్తాన్ వారు పుల్వామా ను కేంద్రంగా చేసుకుని భారత్ పై దాడులను కొనసాగిస్తూనే ఉన్నారు. ఇక అప్రమత్తంగా ఉన్నా సైనిక బలగాలు ఎప్పటికప్పుడు వారి దాడులను తిప్పి కొడుతున్నాయి.
ఇప్పుదు తాజాగా ఉగ్రవాదులు ఏదో ప్లాన్ చేస్తున్న విషయం తెలుసుకున్న సైనికులు వారి స్థావరాలను గుర్తించి కాల్పులు జరుపగా ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు. ఇంకా కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతానికైతే పరిస్థితి అంతా సైనికులు కంట్రోల్ లో ఉన్నట్లు సమాచారం.