Ys Jagan Mohan Reddy :పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం కావడంతో జగన్ భవిష్యత్తు పల్లె ప్రజల చేతిలో ఉన్నట్లు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఓటింగ్ పరంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెజారిటీ గ్రామీణ ప్రాంతాలే. దీంతో జగన్ ముఖ్యమంత్రి పీఠంలో పూర్తయిన తర్వాత ఎక్కువగా ఆయన తీసుకున్న నిర్ణయాలు కూడా పల్లె ప్రాంతాలను ఆకట్టుకునే విధంగానే ఉన్నాయని చెప్పవచ్చు. నాడు నేడు దగ్గర నుంచి అనేక సంక్షేమ పథకాలు గ్రామీణ సచివాలయాలు వాలంటీర్లు చాలావరకు పల్లె ప్రాంత ప్రజలను ఆకట్టుకునే విధంగానే నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలో ఇదే నిర్ణయాలు ఏపీలో పట్టణాలలో చాలావరకు వ్యతిరేకత ఉన్నట్లు టాక్ వినబడుతోంది. కేవలం డబ్బులు పంపిణీ కార్యక్రమం అన్న తరహాలోనే ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్లు సరైన రీతిలో అభివృద్ధి కార్యక్రమాలు చేయటం లేదు అన్నట్లు, రోడ్లు మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేని విధంగా ప్రభుత్వం పాలన చేస్తున్నట్లు భావిస్తున్నారు అనే టాక్ వస్తోంది.
ఇలాంటి తరుణంలో పంచాయతీ ఎన్నికలలో పల్లె మరియు పట్టణ వాసులలో ఎవరు ఏ విధంగా జగన్ పాలనను ఏ విధంగా పంచాయతీ ఎన్నికలలో చూస్తారు అన్నది సస్పెన్స్ గా మారింది. పల్లెల్లో పాఠశాలల మార్పులు చేర్పులు అదేవిధంగా ఆస్పత్రి రూపకల్పనలు మారటం వంటి వాటిని చూసి అభివృద్ధి గా భావించి వైసీపీని ఆదరిస్తారో లేకపోతే ఏ విధంగా జగన్ పాలనను పల్లె ప్రజలు ఈ ఎన్నికలలో చూస్తారు అన్నది ఎవరికి అర్థం కావడం లేదు. ఒకవేళ జరగబోయే పంచాయతీ ఎన్నికలలో పల్లె ప్రజలు కనుక జగన్ పాలనను వ్యతిరేకించి తరహాలో తీర్పు ఇస్తే రాబోయే రోజుల్లో జగన్ నిర్ణయాలు చాలా వరకు మారే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.