ప్రస్తుతం సమాజం ఎప్పుడు ఎలాగా ఉంటుందో అర్థం కావడం లేదు. క్షణక్షణానికి మారిపోతుంది. ముఖ్యంగా టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక మనిషి జీవితంలో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గతంలో 15 సంవత్సరాల క్రితం రిజిస్టర్ కార్యాలయాల్లో కులాంతర వివాహాలు చేసుకుంటే ఇంత బహుమతి ఇవ్వబడుతుంది అనే ఆఫర్లు ఉండేవి.
బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఆడపిల్లలను వివాహం చేసుకుంటే ఇంత ప్రోత్సాహం, దళిత అబ్బాయిలను చేసుకుంటే ఇంత ప్రోత్సాహం అంటూ ప్రభుత్వాలు ఆఫర్లు ఇచ్చేవి. అలాగే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ లో కూడా అవకాశాలు ఉండేవి. కానీ తాజాగా కాలం రివర్స్ అయింది. తాజాగా బ్రాహ్మణ సామాజిక వర్గం లో అర్చకులను వివాహం చేసుకుంటే మూడు లక్షల బహుమతి అందించనున్నట్టు కర్ణాటక ప్రభుత్వం ప్రకటన చేసింది.
ఆలయాల్లో అర్చకులుగా పనిచేసే బ్రాహ్మణ యువకులను పెళ్లి చేసుకునే యువతి కి 3లక్షల బాండ్ ని ప్రోత్సాహక బహుమతి గా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఆలయాల్లో పనిచేశారు చిక్కుల్లో యువకులను పెళ్లి చేసుకోవడానికి యువతులు వెనకడుతున్న తరుణంలో ఈ పథకాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ఎడ్యూరప్ప ప్రకటించారు. దేశ వ్యాప్తంగా బ్రాహ్మణుల యువకుల విషయంలో కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ అయ్యింది.