Tollywood: కువైట్ క్రమంగా తగ్గడంతోపాటు టీకాల కార్యక్రమం ఎలాంటి ఆటంకం లేకుండా నిర్విరామంగా సాగుతుండటంతో… క్రమంగా సాధారణ జీవనం కూడా మెరుగవడంతో టాలీవుడ్ Tollywood డైరెక్టర్లు నిర్మాతలు వరుసగా సినిమాలు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి రంగం సిద్ధం చేశారు. ఈ వేసవిలో వరుసగా పెద్ద సినిమాలు వరుస పెట్టి రానున్నాయి… ఇటు కోవిడ్ నిబంధనలను సైతం తీసేసి… థియేటర్లకు 100% ఆక్యుపెన్సీ ఉండేలా కేంద్రం తాజాగా అనుమతులు ఇవ్వడం తో పూర్తిగా థియేటర్ల వైపు ప్రేక్షకులను తీసుకొచ్చేందుకు ఇటు హీరోలు అటు నిర్మాత దర్శకులు సైతం తీవ్ర ప్రయత్నాల్లో ఉన్నారు. మళ్లీ సాధారణ జన జీవనం… వినోదపు జల్లులు అందించేందుకు అంతా సిద్ధమవుతున్నారు. ఈ వేసవిలో దాదాపు అందరి హీరోల దగ్గర నుంచి పెద్ద సినిమాలు ప్రేక్షకుల్ని పలకరించనున్నాయి.
వరుసగా డేట్లు!
కరుణా కాలంలో షూటింగులకు అనుమతి లేకుండా పోయింది అలాగే థియేటర్లన్నీ మూతపడడంతో కేవలం నోటి ప్లాట్ఫామ్ నే నమ్ముకుని వినోదాన్ని అందించే కార్యక్రమాలు వచ్చాయి. 2 నెలల క్రితం షూటింగులకు కోవిడ్ నిబంధనల మేరకు అనుసరించి నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చారు. దీంతో చాలా వరకు ఆగిపోయిన సినిమాలన్నీ పట్టాలెక్కాయి. దాదాపు పెద్ద స్టార్లు నటించిన సినిమాలన్నీ రెండు నెలల క్రితం షూటింగ్ ప్రారంభం కావడంతో పాటు శరవేగంగా సినిమాలు పూర్తి కావడంతో ఇప్పుడు వాటిని రిలీజ్ చేసేందుకు వరుసగా డేట్లు ఫిక్స్ చేస్తున్నారు. అసలే పీకల్లోతు నష్టాల్లో ఉండి తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక సతమతమవుతున్న నిర్మాతలు వెంటనే వాటిని రిలీజ్ చేసి… ఎలాగైనా తగిన వసూళ్లు సాధించాలని ఆరాటపడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఆచార్య టీజర్ శుక్రవారం విడుదల అయ్యింది. విడుదల తో పాటే సినిమా రిలీజ్ డేట్ మే 13 ఖాయం చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అఖిల్ సాగును సైతం మే నెలలోనే రిలీజ్ చేసేందుకు నిర్మాత దిల్ రాజు ఇప్పటికే సన్నాహాలు చేసుకుంటున్నారు. అలాగే ప్రభాస్ రాదేశ్యం, వెంకటేష్ నారప్ప, గోపీచంద్ సిటీమార్, నితిన్ చెక్, రాజమౌళి RRR, అల్లు అర్జున్ పుష్ప లాంటి సినిమాలన్నీ వేసవిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాయి. కొన్ని సినిమాలకు షూటింగ్ పూర్తయి నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. మరికొన్ని లాస్ట్ షెడ్యూల్లో ఉన్నాయి. ఎలాగైనా వాటిని ఫిబ్రవరిలో పూర్తిచేసి తర్వాత నిర్మాణాంతర పనులు చేసుకొని వేసవిలో ఖచ్చితంగా చెప్పిన తేదీ కు రిలీజ్ చేసేందుకు మళ్లీ ధియేటర్లలో సందడి చేసేందుకు టాలీవుడ్ డైరెక్టర్లు నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు.
టార్గెట్ 1500 కోట్లు!
ఈసారి వేసవి టార్గెట్ టాలీవుడ్ లో ఎక్కువగా పేట్టుకున్నట్లు సమాచారం. గతంలో సైతం వేసవిలో ఎక్కువగా పెద్ద హీరోల సినిమాలు ఉండేవి. అయితే అడపాదడపా మాత్రమే అవి ఉండేవి ఎక్కువగా సంక్రాంతి పండగల వేళ సినిమాల తాకిడి ఎక్కువగా ఉండేది. అయితే ఈసారి ప్రేక్షకులను వేసవిలోనే అన్ని సినిమాలు పలకరించేందుకు సిద్ధమవుతున్నాయి. దీంతో దాదాపు వేసవి వినోదం టార్గెట్ టాలీవుడ్లో 1500 కోట్లు గా పట్టుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీ కు అవకాశం ఇవ్వడంతో పాటు కొవిడ్ టీకాలు రావడంతో క్రమంగా జనంలో విపత్తు భయం తొలగుతుంది. ఈ సమయంలో వినోదాన్ని పంచి… ప్రేక్షకుల నుంచి థియేటర్లలో కాసుల వర్షం కురిపించే కొనేందుకు… దానిద్వారా కోవిద్ నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు టాలీవుడ్లో నిర్మాతలు ఆశగా ఎదురు చూస్తున్నారు.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!