Rashmika Mandana: చలో సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కన్నడ బామ్మ రష్మిక మందన ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా చలామణి అవుతున్న సంగతి తెలిసిందే. అతి తక్కువ టైమ్ లోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోల సరసన కీలక ప్రాజెక్టులు అందుకుంటూ బిజీ హీరోయిన్ గా సత్తా చాటుతూ కెరియర్ సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తూ ఉంది ఈ కన్నడ భామ. 2020 వ సంవత్సరంలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రష్మిక మందన ప్రస్తుతం.. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ పుష్ప లో హీరోయిన్ పాత్ర చేస్తూ ఉంది.
గిరిజన ప్రాంతానికి చెందిన అమ్మాయిగా రష్మిక మందన ఈ సినిమాలో నటిస్తున్నట్లు ఇటీవల రిలీజ్ అయిన వీడియో బట్టి అర్థమవుతుంది. బన్నీ మూవీ పైగా పాన్ ఇండియా.. సినిమా కావడంతో .. పుష్ప పై బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. ఏమాత్రం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ పడిందంటే… తన మార్కెట్ మరింతగా విస్తరించే అవకాశం ఉన్నట్లు రష్మిక మందన భావిస్తోంది. ఇదిలా ఉంటే ఈ కన్నడ భామ కి.. సోషల్ మీడియాలో కూడా బీభత్సమైన ఫాలోయింగ్ అని అందరికీ తెలుసు.
Read More: Rashmika Mandana: రష్మీక ఖాతాలో మరో సరికొత్త రికార్డు..!! అమ్మడు రికార్డుల్లో తగ్గేదేలే..!!
ఎటువంటి ఫోటో లేదా వీడియో రిలీజ్ చేసిన చాలు క్షణాల్లో లైకులు.. వ్యూస్ దక్కించుకోవడం జరుగుతుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు తాజాగా సోషల్ మీడియా లో రష్మిక మందన సరికొత్త రికార్డు సృష్టించింది. విషయంలోకి వెళితే సౌత్ ఇండస్ట్రీ లో ఎయిట్ హీరోయిన్ కి లేనన్ని ఫాలోయింగ్ ఇంస్టాగ్రామ్ లో రష్మిక మందన కి తాజాగా దక్కింది. ఈ విషయం ఎప్పుడో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.