ఈ-కామర్స్ సైట్లు ఫ్లిప్కార్ట్, అమెజాన్లు ఇటీవలే ప్రత్యేక సేల్లను నిర్వహించిన విషయం విదితమే. ఫ్లిప్కార్ట్లో బిగ్ సేవింగ్స్ డేస్ సేల్ను నిర్వహించగా.. అమెజాన్లో ఫ్రీడమ్ సేల్, ప్రైమ్ డే సేల్ను నిర్వహించారు. అయితే ఈసేల్లలో ఎక్కువగా వినియోగదారులు ట్రిమ్మర్లు, కంప్యూటర్ ఉత్పత్తులను కొనుగోలు చేశారని ఆయా సంస్థలు తెలిపాయి. అలాగే పవర్ బ్యాంకులను కూడా ఎక్కువగానే కొన్నారని తెలిపాయి.
ఫ్లిప్కార్ట్ నిర్వహించిన సేల్లో ప్రతి 2 నిమిషాలకు ఒక ట్రిమ్మర్ను వినియోగదారులు కొన్నారు. అలాగే 1000 ఎలక్ట్రిక్ కార్లు 100 కిలోమీటర్ల దూరం వెళ్లేందుకు అవసరం అయ్యే పవర్ కలిగిన పవర్ బ్యాంకులను వినియోగదారులు కొన్నారు. అంటే వారు ఎంత పెద్ద మొత్తంలో ఆయా వస్తువులను కొన్నారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. కరోనా కారణంగా బయట సెలూన్లకు వెళ్లడం కూడా తగ్గించేశారు. కనుకనే ట్రిమ్మర్లను పెద్ద ఎత్తున కొన్నారని అర్థమవుతుంది.
ఫ్లిప్కార్ట్ సేల్లో ప్రతి 120 సెకన్లకు ఒక ల్యాప్టాప్ అమ్ముడైంది. అలాగే కంప్యూటర్ ఉత్పత్తులను కూడా చాలా మంది కొన్నారు. ప్రస్తుతం కరోనా కారణంగా చాలా మంది వర్క్ ఫ్రం హోం చేస్తున్న నేపథ్యంలోనే ఆయా వస్తువులు ఎక్కువగా అమ్ముడుపోయాయని స్పష్టమవుతుంది. ఇక అమెజాన్ ఫ్రీడం సేల్లో పవర్బ్యాంకులు, ఫైర్ టీవీ స్టిక్స్, వన్ప్లస్, శాంసంగ్, రెడ్మీ స్మార్ట్ఫోన్లు, ఐఫోన్లు ఎక్కువగా అమ్ముడయ్యాయి. సేల్లో భాగంగా ఆయా ప్రొడక్ట్స్పై భారీ డిస్కౌంట్లను అందించారు. అందువల్లే కస్టమర్లు వాటిని ఎక్కువగా కొనుగోలు చేశారు.