పసుపు పాల ప్రయోజనాలు గురించి తెలుసుకోడానికి ముందు.. దాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.
ఒక గ్లాసు పాలలో చిటికెడు పసుపు, కలిపి 10 – 15 నిమిషాలపాటు మరిగించండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 5 నిమిషాల తర్వాత టీ స్పూన్ చక్కెర పాలలో కలిపి పాలు గోరు వెచ్చగా అయినా తర్వాత తాగాలి. రోజూ క్రమం తప్పకుండా ఇలా తాగితే శరీరానికి బోలెడంత ఆరోగ్యం లభిస్తుంది.
పాలలోని పోషకాలు, పసుపులోని ఔషద గుణాలు,ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడతాయి. పసుపు పాలు రోగ నిరోధకశక్తిని పెంచడంతో పాటు శరీరంలో వైరస్ వృద్ధిని అరికడుతుంది. నీటి ద్వారా శరీరంలోకి చేరుకున్న వైరస్ రెట్టింపు కాకుండా పసుపు నియంత్రిస్తుంది. పసుపులో ఉండే యాంటీసెప్టిక్, యాస్ట్రింజెంట్ వల్ల శ్వాసకోస సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. దగ్గు, తలనొప్పి జలుబు,ఇతర నొప్పుల తో బాధపడేవారు పసుపు పాలను తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది.
పసుపు పాలలో ఉండే పోషకాలు రక్త ప్రసరణను మెరుగుపరిచి లింఫాటిక్ సిస్టమ్ను కూడా శుద్ధిచేస్తాయి. కామెర్లు దరిచేరకుండా పసుపు పాలు శరీరానికి రక్షణ కల్పిస్తుంది. పసుపు పాలు వైరల్ దాడి నుంచి కాలేయాన్ని రక్షిస్తాయి. కాబట్టి కాలేయ సంబంధ పచ్చ కామెర్ల లాంటి వ్యాధులు రావు. ఒత్తిడిని తొలగించి మంచి నిద్ర ని ఇస్తుంది. కీళ్ల వాపులు, నొప్పులు తగ్గాలంటే పసుపు పాలను క్రమం తప్పక తాగాలి. రుతుక్రమం వల్ల కలిగే పొత్తి కడుపు, ఇతర ఒంటి నొప్పులను దూరం చేస్తుంది.
కేన్సర్ వచ్చే అవకాశాలను బాగా తగ్గిస్తుంది. కనుక పసుపు పాలను తాగుతూ వుంటే అనారోగ్యాలను దరి చేరనివ్వదు. డయాబెటిస్ ఉన్నవాళ్ళు పసుపు కలిపిన పాలు తాగటం వలన రక్తంలో ఉన్న చక్కెర ను తగ్గిస్తుంది దీని వలన షుగర్ అదుపులో ఉంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.
అంతే కాకుండా పసుపు పాలలో ఇది వేసి మీ అందాన్ని రెట్టింపు చేసుకోండి …
పసుపు 3 చిటికెలు, అరగతీసిన గంధం 2స్పూన్లు,పాలు 2 స్పూన్లు తీసుకుని ఒక గిన్నేలొ కలిపి పేస్టులా తయారు చేసుకోవాలి. దానిని ముఖానికి రాసుకుని 15 నిమిషాలు పాటు ఆరిన తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే,మీ చర్మంలోని నల్లదనం మొత్తం పోయి, ఎంతో కాంతివంతమైన, మృదువైన చర్మం మీ సొంతం అవుతుంది.అందమైన చర్మం మీ అందాన్ని రెట్టింపు చేస్తుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు .